
Why are Parijatha flowers offered to God even if they fall?
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
- పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు.
- లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది.
- సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.
- పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.
- వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం.
- అయితే, దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి.
- ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరచినట్లుగా పడతాయి.
- కిందపడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి, దేవుడి సేవలో వినియోగిస్తారు.
- దేవతా పుష్పాలు కావడంతో కిందపడినా వీటికి ఏ దోషమూ ఉండదు.
- అలాగే, చాలా ఎత్తు ఎదిగే పొన్న చెట్టు (దేవ వల్లభం) కూడా దేవతా వృక్షమే.
- ‘ఓం చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః’ అని లలితాదేవిని ఆరాధిస్తారు.
- పొడుగాటి కాడలతో చాలా ఎత్తులో వికసించే పున్నాగలను రాల్చకూడదు.
- కార్తికం మొదలు మాఘ మాసం వరకు విరివిగా పూసే ఈ పూలు రాలిన ప్రదేశాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు.
- కిందరాలినా వీటికి ఏ దోషం ఉండదు కాబట్టి దేవుడికి నిస్సంకోచంగా సమర్పించవచ్చు.
Related Posts
Post-death belongings | చనిపోయిన వ్యక్తి వస్తువులు వాడకూడదా?
Kanyadaanam | ఆడపిల్ల ఇంటి వాళ్ళు అల్లుడి కాళ్లను ఎందుకు కడుగుతారు?
Sister’s marriage | హిందూ సంప్రదాయాల ప్రకారం అన్న కంటే చెల్లి పెళ్లి ముందుగా ఎందుకు చేస్తారు?