ధర్మ మార్గం (యక్ష ప్రశ్నల కథ ) | Story of Yaksha Prashna in Telugu

0
10191
Mahabharata-Magical-Pond-and-Yaksha-Prashna
ధర్మ మార్గం (యక్ష ప్రశ్నల కథ ) | Story of Yaksha Prashna in Telugu

6. ధర్మరాజు  సత్యశీలత

అప్పుడు ధర్మరాజుని ఆ అశరీరవాణి అనేక ధర్మ సందేహాలను అడుగగా ఆయన ఆ సందేహాలకు అద్భుతమైన సమాధానాలనిచ్చాడు.

వాటినే యక్ష ప్రశ్నలు అంటారు. ధర్మ రాజు సమాధానాలకు సంతృప్తి పడ్డ యక్షుడు యమధర్మరాజుగా తన నిజరూపాన్ని బయల్పరిచాడు.

చివరిగా ఎవరో ఒకరినే బ్రతికిస్తానని ఎవరు కావాలో చెప్పమని అడుగగా ధర్మరాజు వెంటనే నకులుని బ్రతికించమన్నాడు.

‘భీమార్జునులను, సహదేవుని కాకుండా నకులునే ఎందుకు బ్రతికించమని కోరినావు ‘అని యముడు అంటే ధర్మరాజు స్వామీ కుంతీ పుత్రులలో నేను జీవించి ఉన్నాను కనుక ధర్మం ప్రకారం మాద్రీ పుత్రులలో ప్రథముడైన నకులుని బ్రతికించమని కోరినాను అన్నాడు.

మరొక వరం కోరుకోమని అడుగగా తాను కోల్పోయిన రాజ్యాన్ని కానీ తమ్ముల ప్రాణాలను కానీ కొరకుండా ఆ బ్రాహ్మణుని అరణిని ఇవ్వమని కోరినాడు.

ధర్మరాజు సత్యశీలతను చూసి సంతోషించిన యమధర్మ రాజు పాండవులందరినీ బ్రతికించి, వారి దాహం తీర్చి, అరణిని ఇచ్చివేశాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here