
4. ధర్మరాజు బోధ
ఆ స్థితికి కారణమేమిటని నకులుడు అడుగగా ధర్మరాజు ‘నాయనా మన కర్మ పరిపాకం వల్లనే సుఖ దుఃఖాలు సంప్రాప్తిస్తాయి.
చేసిన కర్మ చెడని పదార్థం.’ అని అన్నాడు. మిగిలిన వారు తాము ద్రౌపదిని జూదం లో ఒడ్డినందుకని ఒకరు, సభలో అన్యాయం జరుగుతున్నా ప్రతిఘటించలేదని ఒకరూ ఇలా రకరకాల కారణాలు భావించారు.
వారంతా విపరీతమైన దప్పికతో ఉన్నారు. ధర్మరాజు ఆజ్ఞ తో నకులుడు ఒక చెట్టుపై నుండి చూడగా అక్కడొక సరోవరం కనిపించింది.
తాను నీరు తాగి అందరికీ నీటిని తీసుకు రావడానికి నకులుడు అక్కడికి వెళ్ళాడు.
Promoted Content