
శకటాసురుని కథ | The story of Shakatasuruni
నేడు చెట్లను నరికివేయడం వల్ల అకాల వర్షాలు, ప్రమాదకరమైన ఎండలు,పూర్తిగా సమతౌల్యత లేని వాతావరణం నెలకొంది.
పచ్చని చెట్ల విలువ మనం ఈనాడు స్పష్టంగా తెలుసుకుంటున్నాం. చెట్లను అనవసరంగా నాశనం చేయడం ధర్మ విరుద్ధం.
అవసరార్థమై ఒక చెట్టును ఉపయోగించినప్పుడు దానికి బదులుగా నాలుగు చెట్లను నాటమని ధర్మశాస్త్రంలో చెప్పబడింది.
నిష్కారణంగా చెట్లను నాశనం చేయడం ఎంతటి దోషమో తెలిపే పురాణకథ తెలుసుకుందాం.
2. లోమశుని శాపం
ప్రాణాధారమైన వృక్షాలను నిష్కారణంగా పెరికివేసిన ఉత్కచునిపై లోమశునికి ఆగ్రహం కలిగింది. “పాము కుబుసాన్ని విడిచినట్లుగా నీవు నీ శరీరాన్ని వదిలిపెట్టుదువు గాక” అని శపించాడు. తాను చేసిన తప్పుని తెలుసుకుని ఉత్కచుడు మహర్షి పాదాలపైబడి రక్షించమని ప్రార్థించాడు.
అప్పుడు మహర్షి పశ్చాత్తాపము కన్నా ప్రాయశ్చిత్తము లేదు. కానీ మహర్షి శాపం అనుభవింపక తప్పదు కాబట్టి నీవు మరుజన్మలో శకటాసురునిగా జన్మించి ఆ పరాత్పరుడైన శ్రీకృష్ణుని వలన మొక్షాన్నిపొందమని శాప విమోచనం ప్రసాదించాడు.