
Sri Aadivaraha Swamy Devasthanam – Kamanpur, Peddapalli Dist, Telangana
1అది వరాహ స్వామి దేవాలయం, కమానపూర్
ఇక్కడ ముడుపు కడితే మీ సమస్య ఏదైనా తొలగినట్లే!!
మామూలుగా భూమికి సంబంధించిన గొడవలు కేసు వేసి కోర్టులోకి వెళ్లి న్యాయ వాధులతో సమక్షంలో తేల్చుకుంటారు. అ గొడవలు వాయిదా వేస్తూ నెలలు, సంవత్సరాలు సమయం పడుతుంది. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే భూ వివాదాల్లో చిక్కుకున్న వారు ఇక్కడ గుడిలో ముడుపు కట్టి ఆ దేవుడికి వారి సమస్యలు చెప్పుకుంటే సంవత్సరాల తరబడి వాయిదాలలో ఉన్న గొడవలు పరిష్కారం దోరుకుతుండంట. అది ఎక్కడో తెలుసుకోవాలని ఉందా. అయితే పదండి తెలుసుకుందాం.
భూ సమస్యలను పరిష్కరించే దేవాలయం (A Temple to Solve Land Problems)
1. ఈ ఆలయం ఆదివరాహస్వామి వారిది. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కామన్ పూర్ గ్రామంలో ఉండి.
2. మన పురాణాల ప్రకారం ఈ ఆలయం 600 సంవత్సరాల క్రితం నాటిది.
3. ఒక మహర్షి ఆది వరాహమూర్తి దర్శనం కోసం తపస్సు చేస్తే, ఆ మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఆది వరాహమూర్తి ఒక చిన్న బండరాతి పై వెలిశాడు.
4. ఈ విషయం ఎవరికీ గమనిచక పోవడంతో విగ్రహం మరుగున పడిపోయింది.
5. ఇటీవల మూడున్నర దశాబ్దాల క్రితం ఒక తవ్వకాల్లో స్వామి వారి విగ్రహం బయట పడింది. ఇప్పుడు ఆది వరాహమూర్తి ప్రతిష్ఠించి పూజించడం ప్రాంభించారు.
6. తెలుగు రాష్ట్రాల్లో ఆది వరాహ స్వామి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి.
7. ఒకటి తిరుమల కాగా మరొకటి కమాన్పూర్ కావడం విశేషం.
8. ఈ ప్రాంతంలో స్వామి వారిని భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వారి కోరికలు తీరుతుండడంతో భక్తులు వరాల స్వామిగా కొలుస్తున్నారు.
9. ఒక భక్తుడు తన కోరిక నెరవేరిందని మందిరం నిర్మిస్తానని అనుకున్నాడు. అప్పుడు స్వామి వారి కనిపించి, తనకు మందిరం నిర్మించవద్దని, తాను భక్తుల కోరికలు నెరవేరుస్తూ, దర్శనభాగ్యం కల్పిస్తూంటానని చెప్పడంతో అతను మందిర నిర్మాణాన్ని మానుకున్నాడు అని పురాణాలు చెబుతున్నాయి.
10. ఎలుక రూపంలో ఒక బండరాయి మీద చిన్న ఎలుక పరిమాణంలో మొదట భక్తులకు దర్శనమిచ్చారు.
11. తర్వాత క్రమేణా పెరిగి ఇప్పుడు 2 అడుగుల కన్నా పెద్దగా పెరిగారు.
12. బండపై ఉన్న విగ్రహంపై రోమాలు కనిపించడం ఇక్కడ విశేషం.
13. ఈ ఆలయంలో ఏ సమస్యలు ఉన్నవారు అయిన స్వామి వారికి చెప్పుకుని ముడుపు కడితే వారి బాధలు తొలగిపోతాయని ఇక్కడి భక్తుల అపారమైన నమ్మకం
14. ఇక్కడికి ముఖ్యంగా భూ వివాదాల్లో చిక్కుకున్న వారు, వీసా కోసం ప్రయత్నించే వారు, పిల్లలకు మాటలు రాని వారు, సంతానం కలగని వారు ఎక్కువగా వస్తుంటారు.
15. ఇక్కడికి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
16. స్వామివారికి ఉదయం మాత్రమే, అభిషేకాలు, అర్చనలు చేస్తారు. ఉదయం 9 గంటల లోపు అభిషేకం పూర్తి చేసి విగ్రహానికి చందనం పెడుతారు. ఎందుకంటే స్వామి వారి రోమాలు బయటకు వస్తాయి. సాయంత్రం వేళలో అభిషేకాలు, అర్చనలు ఉండవు.
Hindu Temples Guides Related Posts
పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets
సంతానం కలగట్లేదని బాధ పడుతున్నారా? ఈ ఆలయం సందర్శిస్తే చాలు!? | Powerful Temple for Pregnancy?
అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?