2. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదువుకోవాలి.
యానికాని చ పాపాని జన్మాంతరకృతానిచ|
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ:|
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావనే రక్ష రక్ష మహేశ్వర
అనే శ్లోకాన్ని పఠించాలి. శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో
దేవ – దేవి
శరణాగత వత్సల – శరణాగతవత్సలే
మహేశ్వర – మహేశ్వరి అని మార్చి చదువుకోవాలి.
ఈ శబ్దాలు ఏ శక్తిదేవతకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా, శివునకైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు.
Promoted Content