Hindu Festivals | పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదు అంటారెందుకు ?

0
99
reason behind avoiding onion and garlic duing festivals and pooja times
Why are onions and garlic avoided during festivals?

Hindu Festivals

1ఏ పండుగ వచ్చినా ఉల్లి, వెల్లుల్లితో వండిన పదార్థాలు  తినొద్దని చెబుతారు. ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది?

హిందూ ధర్మంలో పండగలకు విశిష్ట స్థానం ఉంది .పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో తినే ఆహారానికి కొన్ని నియమాలున్నాయి. ముఖ్యంగా పవర్ ఫుల్ పర్వదినాల్లో దేవుడిని ఆరాధించేవారంతా కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటిస్తారు. ఇందులో భాగంగా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, ఇతర మసాలా పదార్థాలు తినరు. సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారు. 

దీనికి కారణం ఏమిటి?

ముందుగా మనిషిలో ఉండే మూడు గుణాల గురించి తెలుసుకోవాలి. వీటినే త్రిగుణాలు అంటారు. ఈ మూడు గుణాల కారణంగానే జీవుడు శరీరంలో బంధించి ఉన్నాడని భగవద్గీత చెబుతోంది.

సత్వగుణం:

జ్ఞానంపై ఆసక్తి కలిగిస్తుంది. దైవంపై, దైవకార్యాలపై మనసుని మళ్లిస్తుంది. నిత్యం ప్రశాంతంగా ఉంచుతుంది. మృదువుగా మాట్లాడేలా చేస్తుంది. సత్వగుణానికి ఉదాహరణ రాముడు, కృష్ణుడు.

రజోగుణం:

నేను అనే అహానికి ప్రతీక రజోగుణం. రజోగుణం అధికంగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఆలోచన, ఆందోళన, అసంతృప్తి, అశాంతి, ఏదో చేయాలనే తపనతో ఉంటాడు. రజోగుణానికి ఉదాహరణ దుర్యోధనుడు, రావణుడు.

తమోగుణం:

తమోగుణం అధికంగా ఉంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా-దాక్షిణ్యాలపై ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస ఉంటాయి.

ఈ మూడు గుణాల గురించి ఇప్పుడు ఎందుకంటే మనం తినే ఆహారమే మనలో గుణాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆహారాన్ని కూడా సాత్విక, రజాసిక్, తమాసిక్ ఆహారాలుగా పేర్కొన్నారు.

సాత్విక ఆహారం:

స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఇందులో కాలానుగుణ తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, విత్తనాలు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనస్సును, శరీరాన్ని స్వచ్ఛంగా, సమతుల్యంగా ఉంచుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది. ఎప్పుడూ ఉత్సాహంగా అందరితో స్నేహంగా ఉంటారు.

రజాసిక్ ఆహారం:

మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్లు ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది కానీ శరీర సమతుల్యత గాడి తప్పుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. వీటిని తినడానికి ఎంత ఆతృత ఉంటుందో అంతే వేగంగా కోపం, అసహనం, ఆందోళన కలుగుతాయి.

తమాసిక్ ఆహారం: 

మళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు ఉంటాయి. ఈ ఆహారాన్ని భుజించేవారు బద్దకంగా, నిస్తేజంగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. మనసుకి, శరీరానికి హాని కలిగించే ఈ ఆహారం తీసుకోవడం వల్ల దయగల ఆలోచన వీరి దరిచేరదని చెబుతారు.

ఎందుకు ఈ నియమాలు పాటించాలి?

ప్రశాంతంగా సంతోషంగా జరుపుకునే శుభకార్యాల్లో, పండుగలలో రజోగుణం, తమోగుణం కలిగించే ఆహార పదార్థాలు తీసుకోరు. అందుకే పండుగల సమయంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తినకూడదని చెబుతారు.

 

ఇలాంటి మరెన్నో విషయాలు  వ్యక్తిగతంగా పొందటానికి మరియు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవటానికి ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి.

 

Related Posts

Temples of Vijayanagra Kingdom | వెలుగులోకి వచ్చిన నాగశాసనం విజయనగర రాజుల ఘనతకు నిదర్శనం

Types of Harathis | ఏ హారతి దర్శించుకుంటే ఎలాంటి ఫలితమో తెలుసా!

భర్త అయ్యప్ప దీక్షలో ఉండగా భార్య చేయకూడని పనులు | Ayyappa Deeksha Rules for Wife