ఉద్యోగంలో స్థిరత్వం కోసం లక్ష్మి, సరస్వతి లాంటి శాంత స్వరూపి అయిన అమ్మవారి దేవాలయంలో 9 శుక్రవారాలు పసుపు వత్తులు వేసి, ఆవునేతితో దీపం వెలిగించాలి. ఇదే సమయంలో అమ్మవారికి పసుపు కొమ్ముల దండను సమర్పించాలి. తొలి రోజు 16 పసుపు కొమ్ములతో మొదలు పెట్టి క్రమంగా సరి సంఖ్యలో పెంచుతూ చివరి రోజున 64 పసుపు కొమ్ములతో మాల వేయాలి.