మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.
2. దేవగురువు ఆలోచన
శుక్రాచార్యుని వద్దనుంచీ మృత సంజీవనీ విద్యను ఎలాగైనా దేవతలకు అందించాలని దేవగురు బృహస్పతి ఆలోచించాడు.
తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి మృతసంజీవనీ విద్యను నేర్చుకుని రమ్మని పంపించాడు.
అది కచుని ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా బృహస్పతి తనను నమ్ముకుని ఉన్న దేవతల క్షేమం కోసం కుమారుడిని పణంగా పెట్టాడు.
Promoted Content