
తమిళనాడు రాష్ట్రం , కాంచీపురం జిల్లా , శివకంచి లో , కంచి పట్టణానికి ఉత్తరదిశగా శ్రీ ఏకాంబరేశ్వర ఆలయము ఉంది .
ఇది చాలా అతి పూరతనమైన ఆలయము గా ప్రసిద్ది చెందింది . ఈ దేవాలయము లో ప్రదాన దైవము శివుడు .
భక్తులు ఈ ఆలయము లో స్వామిని ఏకామ్రనాధుడు , ఏకాంబరుడు అని పిలుస్తుంటారు .
ఏకామ్రేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్ధము . పంచ భూత లింగము లో ఒకటి ఈ కంచి ఏకాంబరేశ్వరుడు , ఈ లింగము పృథ్వీలింగము .
కంచి లోకేల్ల పెద్ద ఆలయము గా చెప్పబడే ఈ ఆలయము లో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి .
ఈ ఆలయములో 1008 శివలింగములు , వెయ్యి స్తంబముల కాలామంటపము వున్నాయి.
స్థలపూరణము : ఒకప్పుడు శివపార్వతులు కైలాసములో పాచికలాడుతుండగా , ఆ ఆటలో శివుడు ఓడిపోగా , పార్వతి ఎగతాళి చేసింది అందుకు కోపము వొచ్చిన శివుడు , పార్వతిని కురూపివి కమ్మని శపించాడు .
అప్పుడు పార్వతి తన తప్పును తెలుసుకొని శివుని ప్రార్ధించగా , ఆయన జాలిపడి శాపనివారణ మార్గము చేప్పాడు .
ఆ ప్రకారము , పార్వతి దేవి ఈ భూలోకములో ఒకే ఒక పండు మాత్రమే కాచే ఒక మామిడి చెట్టు (ఆమ్ర వృక్షము) క్రింద కూర్చొని మట్టితో శివలింగము చేసి పూజించడము ప్రారంబించినది .
శివుడు పార్వతి ని పరీక్షించడానికి తన జాతాజూతములోనుంచి గంగను అతి వేగము గా పరేటట్లు జారవిడిచాడు , అతి వేగము గా వొస్తున ప్రవాహానికి పార్వతి తాను రోజు పూజించే మట్టి లింగమును గట్టిగా కౌగిలించుకొని అలాగే వుండిపోయింది ..
అంధుకు శివుడు పరవశము చెంది అత్యంత సుందరమైన రూపము ను ప్రసాదించినాడు .
నూతన అందముతో వెలిసిన వెలిసిన పార్వతి దేవికి అమిత ఆకర్షణీయమైన కన్నులు ఉండటము తో , అమ్మవారికి కామాక్షి అని పేరు వొచినది .
పారవ్థి దేవి కోరికతో శివుడు ఆ మామిడి చెట్టు క్రిందనే వుండిపోయదట అందువలనే శివుడిని ఏకామ్రనాధుడు అనే పేరు వొచ్చినది .
ఈ శివలింగమునకు నూనె ( తైలము ) తో మాత్రమే అభిషేకము చేస్తారు . మిగతా అభిషేకాలాన్ని పక్కన వున్న రాతి శివలింగమునకు చేస్తారు .
ఆలయ ప్రాంగణములో అమ్మవారు తపస్సు చేసిన మామిడి చెట్టు వుండేధి . ఇది నాలుగు శాఖలు గా విస్తరించి ఈ చెట్టుకి నాలుగు రాకల రుచి ని కలిగిన మామిడి కాయ కాసేది .
ప్రస్తుతానికి ఈ వృక్షము యొక్క కాండమును అద్దాల పెట్టెలో పెట్టి దేవాలయములో బద్రపరిచినారు .
శ్రీ శివశంకర గిరిజా రమణా పార్వతనాథా నమో నమః