
visakhapatnam kanaka mahalakshmi temple / విశాఖపట్నం లోని కొలువైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు
విశాఖపట్నంలోని బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి కోవెల చాల ప్రసిద్ధమైనది. ఈ అమ్మవారు స్వయంభువు. ఇక్కడున్న అమ్మవారు స్థానికంగా ఉన్న ఒక బావిలో దొరికిందని, ఆ విగ్రహానికి 1912లొ స్థానిక రాజులు కోవెల కట్టించారని ప్రతీతి.
ఇక్కడ ఉన్న విశేషం ఏమిటంటే, భక్తులు తము స్వయంగా మూలవిరాట్టుకు పూజలు చేసుకోవచ్చు. అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మార్గశిర మాసంలో పూజలు చాల విశేషంగా జరుగుతాయి. మొత్తం మాసంలో దాదాపు 10 లక్షల మంది భక్తులు వైజాగ్, చుట్టుపక్కల ప్రాంతాలనుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని కొలుస్తారు. ఈ చల్లని తల్లి కోరిన కోర్కెలు తీరుస్తుందని, సౌభాగ్యాన్నిస్తుందని నమ్మిక.
మార్గశిర మాసం ప్రత్యేకించి లక్ష్మివారం, సాధారణ రోజువారీ పూజలే కాక, ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, లలిత సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, హరికథ కాలక్షేపం వంటివి కూడా నిర్వహించబడతాయి. మార్గశిర మాసంలో ప్రతిరోజూ అన్నదానం జరుగుతుంది. భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఇందులో పాల్గొంటారు.
స్థానిక రాజులు కటించలేదు