
Jvaalaatoranotsavam in Telugu / జ్వాలాతోరణోత్సవం
శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన పవిత్ర కార్తిక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు ‘కార్తిక పూర్ణిమ’.
ఈ రోజు చేసే స్నాన, దాన, దీపదానములతో పాటు కేవలం చూసినంతనే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం- “జ్వాలాతోరణిత్సవం”.
జ్వాలాతోరణోత్సవాన్ని ప్రతి సంవత్సరం కార్తికమాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు శివాలయాల్లో నిర్వహిస్తారు.
కార్తిక పూర్ణిమనాడు సాయంత్రం శివాలయాల్లో ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి, మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి. ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా ఉంటుంది. దీనికి ‘జ్వాలాతోరణం” అని పేరు.
శివపార్వతులను పల్లకీలో ఉంచి జ్వాలాతోరణం క్రింద తిప్పతారు. ఈ ఉత్సవానికి ‘జ్వాలాతోరణోత్సవం” అనిపేరు.
ఈ జ్వాలాతోరణోత్సవం అమల్లోకి రావడం వెనుక అనేక పురాణాగాధలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్ని లయ కారుడైన పరమశివుడు దేవేరి అయిన పర్వవతిదేవితో ముడిపడి ఉన్నాయి.
5. తమిళనాడు
తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని శివాలయాల్లో ఎండుటాకులు, పుల్లలు ఆలయానికి ఎదురుగా కుప్పగా వేసి నిప్పుతో వెలిగిస్తారు. దీనికి “చొక్కప్పనయ్” అని పేరు.
ఈ ఉత్సవాన్ని శివుడు తన మూడవ కంటిని తెరిచి రాక్షసుల రథములను కాల్చినందులకు చిహ్నంగా జరుపుతారు.
ఈ విధమైన ఉత్సవాలే కాకుండా ఈనాడు శివాలయాల్లో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం ఆచారం.
ఇవన్నీ అగ్ని ఆరాధనకు చిహ్నంగా చెప్పవచ్చు. జ్వాలాతోరణోత్సవ దర్శనం, దీపం వెలిగించడం, దానం చేయడం అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయి.