
Jvaalaatoranotsavam in Telugu / జ్వాలాతోరణోత్సవం
శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన పవిత్ర కార్తిక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు ‘కార్తిక పూర్ణిమ’.
ఈ రోజు చేసే స్నాన, దాన, దీపదానములతో పాటు కేవలం చూసినంతనే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం- “జ్వాలాతోరణిత్సవం”.
జ్వాలాతోరణోత్సవాన్ని ప్రతి సంవత్సరం కార్తికమాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు శివాలయాల్లో నిర్వహిస్తారు.
కార్తిక పూర్ణిమనాడు సాయంత్రం శివాలయాల్లో ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి, మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి. ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా ఉంటుంది. దీనికి ‘జ్వాలాతోరణం” అని పేరు.
శివపార్వతులను పల్లకీలో ఉంచి జ్వాలాతోరణం క్రింద తిప్పతారు. ఈ ఉత్సవానికి ‘జ్వాలాతోరణోత్సవం” అనిపేరు.
ఈ జ్వాలాతోరణోత్సవం అమల్లోకి రావడం వెనుక అనేక పురాణాగాధలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్ని లయ కారుడైన పరమశివుడు దేవేరి అయిన పర్వవతిదేవితో ముడిపడి ఉన్నాయి.
4. తిరువణ్ణామలై
జ్వాలాతోరణోత్సవం శివాలయాల్లో నిర్వహిస్తారు. జ్వాలాతోరణితోత్సవం అనగానే ప్రధానంగా తిరువణ్ణామలై గుర్తుకు వస్తుంది. మనరాష్ట్రంలో శ్రీశైలంలో చాలా గొప్పగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాలలో జ్వాలాతోరణం క్రింద శివపార్వతులను మూడుసార్లు ఊరేగించిన అనంతరం రైతులు కాలుతూ ఉన్న గడ్డిని ఆర్పి తీసుకువెళ్ళి పశువులకు వేస్తారు. అందువల్ల పశుగణాభివృద్ధి జరుగు తుందనే నమ్మకం అమల్లో ఉంది.