జ్వాలాతోరణోత్సవం | Jvaalaatoranotsavam in Telugu

0
8324
karthika-pournami-hariome
jvaalaatoranotsavam / జ్వాలాతోరణోత్సవం

Jvaalaatoranotsavam in Telugu / జ్వాలాతోరణోత్సవం

శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన పవిత్ర కార్తిక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు ‘కార్తిక పూర్ణిమ’.

ఈ రోజు చేసే స్నాన, దాన, దీపదానములతో పాటు కేవలం చూసినంతనే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం- “జ్వాలాతోరణిత్సవం”.

జ్వాలాతోరణోత్సవాన్ని ప్రతి సంవత్సరం కార్తికమాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు శివాలయాల్లో నిర్వహిస్తారు.

కార్తిక పూర్ణిమనాడు సాయంత్రం శివాలయాల్లో ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి, మరో కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి. ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణంలాగా ఉంటుంది. దీనికి ‘జ్వాలాతోరణం” అని పేరు.

శివపార్వతులను పల్లకీలో ఉంచి జ్వాలాతోరణం క్రింద తిప్పతారు. ఈ ఉత్సవానికి ‘జ్వాలాతోరణోత్సవం” అనిపేరు.

ఈ జ్వాలాతోరణోత్సవం అమల్లోకి రావడం వెనుక అనేక పురాణాగాధలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్ని లయ కారుడైన పరమశివుడు దేవేరి అయిన పర్వవతిదేవితో ముడిపడి ఉన్నాయి.

2. రాక్షస సంహారం కోసం పరమశివుడు

పూర్వం రాక్షస సంహారం కోసం పరమశివుడు యుద్ధానికి వెళ్ళాడు. కొన్నివేల సంవత్సరాలు అయినా శివుడు యుద్ధం

నుంచి తిరిగి రాలేదు. శివుడిని గురించిన సమాచారం తెలియలేదు. దీనితో అనేకరాకాలైన ఆలోచనలు చేసిన పార్వతీదేవి తన భర్త యుద్ధం నుంచి తిరిగి రాకపోయేసరికి, భర్తలేని జీవితం వ్యర్థమనుకుని సహగమనం చేసేందుకు సిద్దమైంది. చితిపేర్చి నిప్పపెట్టబడింది. మంటలు బాగా పైకి లేచాయి. పార్వతీదేవి అందులో దుమికేందుకు సిద్దపడింది. ఆ రోజు కార్తిక పూర్ణిమ. సరిగ్గా అటు వంటి సమయంలో రాక్షసుల సంహారం చేసి శివుడు తిరిగి వచ్చి, పార్వతీదేవి సహగమన ప్రయత్నాన్ని నిలుపుదల చేసి, చితిని జ్వాలాతోరణంగా మార్చి శివపార్వతులిద్దరూ ఆ తోరణం క్రింద మూడుసార్లు దూరారు. అప్పట్నుంచి ‘జ్వాలాతోరణిశోత్సవం” అమల్లోకి వచ్చినట్లు చెప్పబడుతూ ఉంది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here