
Interesting Facts About Tirumala Routes
2అలిపిరి మార్గం (Alipiri Steps / Road):
ఇప్పటి వారికి అలిపిరి మార్గం అందరికి తెలిసినది. తాళ్ళపాక అన్నమాచార్యులు మొదటిసారిగా అలిపిరి నుండే ఏడుకొండలు ఎక్కాడని చరిత్ర చెబుతుంది. అలిపిరి అనే పదం తమిళ భాష నుంచి వచ్చింది. తమిళంలో ‘ఆదిపడి’ అంటే మొదటి మెట్టు అని అర్థం. ఇదే కాలక్రమంలో అలిపిరిగా మారింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే 12 కిలోమీటర్లు నడవాలి. అలిపిరి మెట్ల దారి లేక ముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థం దారి నుంచే తిరుమలకు చేరుకునేవారు. పురాతన శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. ఈ దారి గుండా వేళ్ళెటప్పుదు కనిపంచే ప్రదేశాలు,
1. మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది.
2. 2 అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయణా స్వామి ఆలయం వస్తుంది.
3. 10 మెట్లు ఎక్కగానే పిడుగుపాటు ద్వసం అయి మళ్ళీ నిర్మింపబడిన పెద్ద గోపురం వస్తుంది.
4. తర్వాత కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది.
5. వెంటనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు వస్తాయి.
6. తర్వాత గాలిగోపురంకి చేరుకుంటారు. ఇక్కడి నుంచి తిరుపతి ప్రకృతి అందాలు, గోవిందరాజుస్వామి, అలిమేలుమంగమ్మ దేవాలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి.
7. తర్వాత మహంతులు పూజించే సీతారామలక్ష్మణుల ఆలయం. ఇక్కడే పెద్ద శ్రీ ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో ఉన్న విగ్రహం ఉంటుంది.
8. ఇక్కడి నుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తే ఘంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు.
9. అవ్వాచారి కోన నుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది.
10. తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది.
11. మోకాళ్ళ మేట్లు వచ్చాక పక్కనే సారె పెట్టెలు ఉంటాయి.
12. దీని తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.
13. చివరగా అవ్వాచారి ఆలయం.
14. అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.
అలిపిరి మార్గం వివరాలు (Alipiri Steps Details):
1. ఈ మార్గంలొ ఏడుకొండలు ఎక్కి శ్రీవారి ఆలయం చేరుకోవడానికి ఆరోగ్యంగా ఉన్న వారికి గంటన్న సమయం పడుతుంది.
2. 12 కి.మీ. ల దూరం కాలి నడక.
3. ముక్తి మార్గంగా భక్తులు విశ్వసిస్తారు.
అలిపిరి మార్గం కథ (Alipiri Steps History)
1. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర ఉన్న మెట్లను నిర్మించారు.
2. క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు గాలి గోపురం మార్గంను నిర్మించారు.
3. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుండి గాలి గోపురం వరకు మెట్లను నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.
4. క్రీ.శ. 1628లో అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలి గోపురాన్ని నిర్మించారు.