
Importance of Vaikunta Ekadasi
2వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం (Vaikuntha Ekadashi Prasathya)
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించిన వివరణ అనేక పురాణాలలో ఉంది.. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు.
ఈ మురాసురుని అక్రమాలు, ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శ్రీమహా విష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసర మని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు.
ఇదే అదనుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించాడు.
ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ‘‘ఏకాదశి’’ అని నామకరణం చేశారు.
వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధిచెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు.
– ముస్త్యాల రామచంద్ర శర్మ, అవధాని
Can we place dakshinavrita sankham in pooja room??