కార్తీక పౌర్ణమి విశిష్టత | Karthika Pournami Importance 2025

3
9931
karthika Pournami
karthika Pournami Importance In Telugu

Karthika Pournami Importance In Telugu

1కార్తీక పౌర్ణమి విశిష్టత

కార్తీక మాసములో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెపుతున్నాయి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి.

ఇందులో భాగంగా… మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే… కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందజేయటం వలన పుణ్యం లభిస్తుంది.

మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే స్మిన్‌ సన్నిధింకురు||

కార్తీక పూర్ణిమ 2025 తేదీ మరియు సమయం

కార్తీక పూర్ణిమ తేదీ : బుధవారం, నవంబర్ 5, 2025

కార్తీక పూర్ణిమ సమయాలు:

పూర్ణిమ తిథి ప్రారంభం – నవంబర్ 04, 2025న రాత్రి 22:36 గంటలకు

పూర్ణిమ తిథి ముగుస్తుంది – నవంబర్ 05, 2025న సాయంత్రం 18:48 గంటలకు

కార్తీక పూర్ణిమ వ్రత, పూజా విధానం (karthika Pournami Vrat & Puja Vidh):

1.ఈ రోజున వేకువ జామున నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం అచరించండి.
2.నది స్నానం కుదరిని వారు గంగాజలం కలిపిన నీటితో ఇంట్లో స్నానం చేయవచ్చును.
3.తరువాత లక్ష్మీ దేవి, శ్రీమహావిష్ణువు మరియు శివుడి ముందు నెయ్యితో దీపం వెలిగించాలి.
4.పూజలు, పండ్లు, పువ్వులు, నైవేద్యాలు సమర్పించి ధూప హారతి ఇవ్వండి.
5.రాత్రి సమయంలో చంద్రోదయం తర్వాత పాలను నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి.
6.విష్ణువుకు పూజ చేసిన తరువత తర్వాత చలిమిడి, వడపప్పు మరియు పంచామృతాన్ని ప్రసాదంగా సమర్పించి ఉపవాసం విరమించాలి.

కార్తీక పూర్ణిమ మహత్యం

కార్తీక పూర్ణిమ హిందూ ధర్మశాస్త్రాలలో పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజున శివుడు త్రిపురాసుర సంహారం చేసి, త్రిపురాసురుల పాలనను అంతం చేశాడు. దేవతలు ఈ విజయాన్ని “దేవ దీపావళి”గా జరుపుకున్నారు. తులసి మొక్క జన్మించిన రోజుగా కూడా కార్తీక పూర్ణిమను భావిస్తారు.

శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం స్వీకరించిన రోజూ ఇదే. అలాగే, శివపార్వతుల కుమారుడు కార్తికేయుడు జన్మించిన పవిత్రమైన రోజుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం, గంగా స్నానం, దీపదానం చేయడం మహాఫలప్రదంగా పరిగణించబడుతుంది. దీపారాధన చేసి, శివుడు, విష్ణువు, కార్తికేయుడు, తులసీ దేవి, గంగాదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం.

కార్తీక పౌర్ణమి ఉపవాస దీక్షలో పాటించాల్సిన నియమాలు | Karthika Pournami in Telugu

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here