
2. కథ
తీవ్రమైన వేసవి కాలం లో ఒక నాడు జమదగ్ని మహర్షి ఉదయాన్నే ఆశ్రమం బయటకు వచ్చి యజ్ఞానికి కావలసిన సమిధలను అమర్చుకుంటూ ఉన్నాడు.
ఉదయం కొంత గడవగానే ఎండ తీవ్రత పెరిగింది. మహర్షి చెమటలతో తడిసిపోయాడు. నాలుక ఎండిపోయింది. ఎండ వేడిమికి తన పనిమీద ఏకాగ్రత కోల్పోతున్నాడు.
దాంతో ఆయనకు సూర్య భగవానునిపై కోపం వచ్చింది. సూర్య భగవానుని వెళ్లిపొమ్మని ఆదేశించాడు. కానీ కాల ధర్మాన్ని తప్పని సూర్యుడు ఆయన మాటలను వినలేదు. దాంతో జమదగ్ని మహర్షి మరింత కోపోద్రిక్తుడైనాడు.
Promoted Content