
Goswami Tulsidas Jayanti 2025
1గోస్వామి తులసీదాస్ జయంతి
హిందూ సాంప్రదాయాల జాగృతికి భక్తి బాట చూపింది గోస్వామి తులసీదాసు కవి గారు. ఈ రోజు గోస్వామి తులసీదాసు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
గోస్వామి తులసీదాసు పుట్టుక (Goswami Tulsidas Birth Secrets & Family):
గోస్వామి తులసీదాసు ఈయనను రాంబోలా దూబే గోస్వామి తులసీదాస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. గోస్వామి తులసీదాసు గారు శ్రావణ మాసంలో శుక్ల పక్షం ఏడో రోజున జన్మించడం జరిగింది. తులసీదాస్ గారు 11 ఆగష్టు, 1511లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కస్గంజ్ జిల్లా, సుకర్ క్షేత్ర గ్రామంలో జన్మించారు. 30 జూలై, 1623లో (111 వయస్సులో) పరమపదించారు.
గోస్వామి తులసీదాసు తండ్రిగారి పేరు ఆత్మారాముడు, తల్లిగారి పేరు హులసి సాధారణంగా అందరూ తల్లి గర్భంలో 9, 10 నెలలకు జన్మిస్తారు. కాని మన గోస్వామి తులసీదాసు గారు తన తల్లి గర్భం నుంచి 12 నెలలకు జన్మించారంటా. అయన జన్మించగానే నవ్వడంటా. అలాగే ఆయన జన్మించగానే 5, 6 నెలల పిల్లాడిల కనిపించారంటా. అంతేకాదు ఆయన నోటినిండ దంతలతో జన్మించారాని పండితులు చెబుతున్నారు.
గోస్వామి తులసీదాసు బాల్యం (Goswami Tulsidas Childhood)
అభూక్త మూల నక్షత్రంలో గోస్వామి తులసీదాసు గారు జన్మించాడు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయంగా భావిస్తుంటారు. అయన అ నక్షత్రంలో జన్మించడం వలన తన తండ్రికి అశుభం కలుగుతుంది అని సంకేతం. అందుకు కారణంగా గోస్వామి తులసీదాసు గారిని పుట్టిన నాలుగు రోజులకే తన తల్లిదండ్రులు ఆయనకు చునియా అనే మహిళకు పెంచుకొమని అప్పగించారు. ఆమె 5 సంవత్సరాలు పెంచి చనిపోయింది. ఆ తర్వాత తల్లి పార్వతి దేవి స్వయంగా గోస్వామి తులసీదాసు గారికి ఆహారం ఇచ్చేందుకు ప్రతిరోజూ సాయంకాలం వచ్చేదని చెబుతుంటారు.
గోస్వామి తులసీదాసు చదువు (Goswami Tulsidas Education)
బాబా నరహరి దాస్ అనే సాధువు ఆ అనాథబాలుడైన గోస్వామి తులసీదాసు గారిని పెంచి విద్య నేర్పిస్తారు. తరువాత శేషసనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర గోస్వామి తులసీదాసు గారు వేద, వేదాంగాలను నేర్చుకుంటాడు. ఆతని రూప, గుణ, శీల, స్వభావ, విద్వలకు మైమరిచి ఒక కులీ బ్రాహ్మణడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. తన భార్య అంటే ఎంతో ప్రేమ మన గోస్వామి తులసీదాస్ గారికి. అమే పేరు రత్నావళి. అయితే రత్నావళి గారు గోస్వామి తులసీదాసు ఇంట్లో లేని సమయంలో తన పుట్టినింటికి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న గోస్వామి తులసీదాసు గారు తన భార్యను కలుసుకోడానికి బయలుదేరాడు. చీకటి పైగా వర్షం పడుతుంది ఆ సమయంలో నది దాటి తన భార్య వద్దకు చెరుకుంటాడు. ఆ సమయంలో అతని భార్య తనకు ఒక మాట చెప్పింది. ఆ మాటతో అతని జీవితం మారిపోతుంది.
గోస్వామి తులసీదాసు గారు భక్తుడుగా మారిన వైనం (How Goswami Tulsidas Became Devotee?)
“నాధా! ఎముకలు, చర్మం తో కూడిన మీ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరామచంద్రుడు మీద ఉంటే ఆ భయభీతియే ఉండదు కదా?!” అన్న గొప్ప రత్నావళి మాటలే గోస్వామి తులసీదాసు గారికి తారకమంత్రం మయ్యాయి. ఆరోజు నుండి గోస్వామి తులసీదాసు విరాగియై శ్రీరామచంద్రుని భక్తి లో నిమగ్నులై పోయారు.
స్మార్త-వైష్ణవ హిందూ సన్యాసిగా మరియు కవిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఈయన సంస్కృతం మరియు అవధి, బ్రజ్లో అనేక ప్రసిద్ధ రచనలు రచించాడు. తులసీదాసు గారు హనుమాన్ చాలీసా అలాగే రామచరితమానస్ అనే ఇతిహాసం రచించి గొప్ప కవిగా ప్రసిద్ధి పొందారు. హనుమాన్ చాలీసాను ఆ ఆంజనేయ స్వామికి అంకితం చేయడం జరిగింది. ప్రసిద్ధ సంకట్ మోచన్ దేవాలయాన్ని కూడా మన గోస్వామి తులసీదాసు గారే నిర్మించడం జరిగింది. ఆ ప్రదేశంలోనే భజరంగ్ బలి స్వయంగా గోస్వామి తులసీదాస్ గారికి దర్శనం ఇస్తారని పురోహితులు చెబుతుంటారు.
గోస్వామి తులసీదాసు ఇతిహాసాలు (Goswami Tulsidas Ithihaasaalu)
శ్రీరాముని జీవిత విధానం గురించి సంస్కృత రామాయణాన్ని తిరిగి మాతృభాషలో చెప్పడంలో పెద్ద పాత్ర వహించాడు. గోస్వామి తులసీదాసు గారు తన యొక్క ఎక్కువ జీవిత భాగం వారణాసి మరియు అయోధ్యలో జీవించాడని అంటారు. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని తులసి ఘాట్ అనే నామకరణంతో పిలుస్తున్నారు. లోక కల్యాణానికి కారణమైన ‘రామచరితమానస్’ అనే మహాకావ్యాన్ని గోస్వామి తులసీదాసు గారు అయోధ్యలోనే రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత గోస్వామి తులసీదాసు గారు రెండున్నర సంవత్సరాల పాటు కాశీలో ఉంటూ రామచరిత మానస్ ను పూర్తి చేశాడు.
వాల్మీకి అవతారమని గోస్వామి తులసీదాసు గారిని అంటారు. ఆయనకు అపర వాల్మీకి అని కూడా అంటారు. ఆయన సంస్కృతంలోనే కాకుండా హిందీలో 22 రచనలు రచించాడు. సరళమైన సంస్కృత, తత్సమ శబ్దాలతో కూడిన అవధి భాషలో రచించడం చేత తులసీ రామాయణం లోక ప్రసిద్ధి గాంచింది.
ఆయన రచయితగానే కాకుండా , అంతరించుపోతున్నా హిందూ జ్వాలను, భక్తి ఉద్యమంను మళ్ళీ విస్తరింపచేసిన మహా భక్తుడు. ముస్లిం అరాచకాల నుండి మరియు మతమార్పిడి దౌర్జన్యం నుండి హిందూ సమాజంను కాపాడుకోవడంలో ఈ మహత్ముడు ముక్ఖ్య పాత్ర పోషించాడు. హిందీ మరియు భారతీయ, ప్రపంచ సాహిత్యంలో గొప్ప గొప్ప కవులలో ఆయన ఒకరు.
గోస్వామి తులసీదాస్ జయంతి పూజ చేసే విధానం (Puja Vidh & Rituals on Goswami Tulsidas Jayanti):
గోస్వామి తులసీదాస్ జయంతి రోజున,
1. హిందువులు అందరూ దేశవ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముడు దేవాలయాలలో శ్రీరామచరితమానస్ యొక్క వివిధ పారాయణాలు జరుగుతాయి, వెళ్లి దర్శించుకోవాలి .
2. ఆ రోజున భక్తులు అందరూ పూజ గదిని శుభ్రం చేసి శ్రీరాముడికి & ఆంజనేయ స్వామికి పూజలు చేయాలి.
3. దేవుళ్ళ ముందు నెయ్యి ఉపయోగించి దీపం వెలిగించాలి.
4. ప్రసాదం మరియు తులసి ఆకులు, తులసి మాల కూడా సమర్పించాలి.
5. దోహాలు మరియు చౌపాయి లేదా శ్లోకాలు 108 సార్లు పఠించాలి.
ఆ తర్వాత,చేతులు జోడించి దేవుళ్ళను వేడుకుంటారు.
ఏదైనా మంగళవారం, ఆదివారం లేదా నవమి తిథి నుండి శ్లోకాలు చదవడం ప్రారంభించవచ్చు.
తులసీదాస్ 2025 తేదీ & సమయం:
తులసీదాస్ 528వ జయంతి
తులసీదాస్ జయంతి గురువారం, జూలై 31, 2025
సప్తమి తిథి ప్రారంభం – 02:41 జూలై 31, 2025
సప్తమి తిథి ముగుస్తుంది – ఆగస్ట్ 01, 2025న 04:58
Related Posts
| Ashunya Shayana Vratam 2025 | అశూన్య శయన వ్రత ప్రాముఖ్యత, వ్రతం ఎలా చేయాలి?
కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar
కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation
కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023
దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes
Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు
Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి
సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023