
Story of Poornavali
1. పూర్ణవల్లీ దేవి ఎవరు ? ఆమె అక్కడ కొలువై ఉంది?
పూర్ణవల్లీ దేవి ఆమెనే పూర్ణవల్లీ తాయారు అంటారు. ఆమె దరిద్రాన్నీ, ఆకలినీ, కరువునీ రూపుమాపే చల్లని తల్లి. తమిళనాడు లోని (ఉత్తమర్ కోయిల్) ఉత్తమ కోవెల లో పూర్ణవల్లీ దేవి కొలువై ఉంది. ఈమె లక్ష్మీదేవి అవతారం.
పూర్ణవల్లీదేవి కథ
ఒకనాడు పార్వతీ దేవి వద్దకు తన రూపం లో వెళ్ళి పాదపూజలందుకుంటున్న బ్రహ్మను చూసి పరమేశ్వరుడు ఆగ్రహించి బ్రహ్మ శిరసును ఖండించాడు. దానివల్ల బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకున్న మహాదేవుడు తాను ఖండించిన బ్రహ్మ తలను భిక్షాపాత్రగా చేసుకుని బ్రహ్మ హత్యా పాతకం నుండీ బైటపడటానికి భిక్షను యాచించాడు. ఆ భిక్ష పాత్రలో ఎవరెంత భిక్ష వేసినా మరుక్షణం ఆ పాత్ర మాయమైపోయేది. తన బ్రహ్మ హత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి పరమ శివుడు అన్ని పుణ్య క్షేత్రాలనూ తిరుగుతూ ఒకనాడు ఉత్తమర్ కోవెలకు వచ్చాడు. అక్కడ లక్ష్మీదేవి ఆయ్న భిక్షాపాత్రను నింపింది. కానీ ఆశ్చర్యంగా ఆ ఆపాత్ర మాయమవలేదు. పరమేశ్వరునికే ఆమె భిక్ష వేసి ఆయనను బ్రహ్మ హత్యాపాతకం నుండీ విముక్తుని చేసింది పూర్ణవల్లీ దేవి. అందుకే ఆ ప్రాంతాన్ని భిక్షాంధర కోవెల (బిచ్చందర్ కొయెల్) అంటారు. ఇక్కడ శ్రీమహా విష్ణువు పురుషోత్తమునిగా దర్శనమిస్తాడు.
Related Stories
Shani Dev Secrets | శనిదేవుడి ఈ ఐదు రహస్యాల గురించి తెలుసుకోండి.
విజయాలను అందించే అపరాజితా దేవి! | Goddess of Victory Aparajitha Devi
ఇహ పర సుఖ దాయిని త్వరితాదేవి | Story of Twarita Devi in Telugu
విశేష ధన ప్రాప్తి కోసం శ్రీ వాస్తు ఐశ్వర్య కాళి | Quick Vastu remedy for money and abundance
Hari ome is superB
P V Rao గారు నమస్కారము మండి మంచి విషయాన్ని తెలియజేయంసినందుకు ధన్యవాదాములు
Thanks: