
7. కురూపులుగా మారిన కుశనాభుని కూతుళ్ళకు శాప విమోచనం కలిగిందా?
కురూపులుగా మారిన తన కూతుళ్ళకు శాప విమోచనం తప్పక జరుగుతుందని నమ్మి కుశనాభుడు వేచి చూశాడు.
కొంతకాలానికి కాంపిల్య నగరానికి రాజైన బ్రహ్మదత్తుడు వారందరినీ వివాహం చేసుకోడానికి సంతోషంగా అంగీకరించాడు. ఆయన వివాహం చేసుకోవడానికి చేయి పట్టుకోగానే ఒక్కొక్కరి శాపం విముక్తి అయింది. వారంతా తిరిగి సౌందర్య వతులుగా మారిపోయారు.
ఆ కన్యలు కురూపులుగా, కుబ్జలుగా ఉన్న ప్రదేశాన్నే కన్యాకుబ్జం అని అంటారు. బ్రిటీషువారి పాలనలో వారికి పలకడం చేతకాక ఆ ప్రాంతాన్ని ‘కనోజ్’ గా పిలిచారు. ఇప్పటికీ మనం కన్యాకుబ్జాన్ని ‘కనోజ్’ అనే అంటున్నాం.
Promoted Content