
6. కుశనాభుడు కూతుళ్ళ సమస్యను పరిష్కరించాడా?
వాయు దేవుని శాపం గురించి తెలుసుకున్న కుశనాభుడు బాధపడటం కన్నా ముందు ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఎందుకంటే అత్యంత శక్తి యుక్తులు కలిగి, దేవేంద్రుని కూడా ఓడించ గలిగిన తన కూతుళ్ళు, వాయుదేవుని తిరిగి శపించకుండా క్షమించి శాపగ్రస్తలై ఇంటికి తిరిగి రావడం ఆయనకు అమితాశ్చర్యాన్ని కలిగించింది.
అప్పుడాయన తన కూతుళ్ళ సహనానికీ, క్షమా గుణానికీ, సంయమనానికీ ఎంతగానో పొంగిపోతాడు. తన కూతుళ్ళు తన గౌరవాన్ని భంగపరచకుండా ఉండడం కోసం ఎంతటి త్యాగం చేశారో తలచుకొని తండ్రిగా ఎంతో గర్వించాడు.
వాయుదేవుడంతటి వాడు కేవల మొహం తో శపించి ఉండడనీ, ఈ శాపానికి వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందనీ భావించి, కూతుళ్ళను ఓదార్చాడు.
Promoted Content