
4. వనవిహారం లో కుశనాభుని కూతుర్లకు ఏమి ఎదురైంది..?
వనవిహారానికి వెళ్ళిన సమయంలో వారిని చూసి వాయుదేవుడు మోహించాడు. తనను పెండ్లాడితే వారందరినీ దేవకన్యలను చేస్తానని భ్రమింపచేస్తాడు.
అప్పుడు వారంతా ముక్తకంఠం తో వాయుదేవుని మాటను తిరస్కరించారు. “వాయుదేవా..! మేమంతా తండ్రి చాటు బిడ్డలం, దేవేంద్రునైనా మా ధర్మబలం తో ఓడించగల శక్తి మాకు ఉంది.
కానీ మా తండ్రి మాటకి మేము సర్వదా కట్టుబడి ఉంటాం. కాబట్టి నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకునే విషయమై మా తండ్రిని అడగటమే న్యాయం.
ఆయన ఎవర్ని వివాహం చేసుకొమంటే మేము వారినే వివాహం చేసుకుంటాం.
యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి
ఏ తండ్రీ తన కూతుళ్ళకు తగని సంబంధం చేయడు కాబట్టి ఆ బాధ్యతని మా తండ్రికే విడువడం సరైనది అన్నారు.
Promoted Content