5. గరుత్మంతుడు తెచ్చిన అమృతం నాగులు తాగారా?
షరతు ప్రకారం గరుత్మంతుడు ఎంతో శ్రమకోర్చి, దేవతలతో పొరాడి,అమృతభాండాన్ని తీసుకు వచ్చాడు. తన తల్లిని విడిపించాడు. అమృతాన్ని స్వీకరించడానికి నాగులు సమాయత్తమయ్యారు. పవిత్రమైన అమృతాన్ని స్నానం చేసి తాగుదామని ఆ కద్రువ పుత్రులంతా స్నానానికి వెళ్లారు. ఇంతలో దేవేంద్రుడు ఆ అమృతభాండాన్ని తీసుకుని నింగికెగిరాడు. స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అమృత భాండం లేక పోయేసరికి నాగులు కలవర పడ్డారు. ఆకాశం వైపుగా ఇంద్రుడు అమృత భాండాన్ని తీసుకువెళ్లడం చూశారు. ఆ భాండం పెట్టిన చోట కొన్ని చుక్కలు అమృతం పడటం గమనించారు. ఆత్రంగా వాటిని నాలుకలతో నాకారు. దానివల్ల వారి నాలుకలు రెండుగా చీలిపోయాయి.
Promoted Content