2. కద్రువ వినత పై ఎలా అక్కసు తీర్చుకుంది?
కద్రువ, వినతా ఇద్దరూ సాగర తీరంలో నడుస్తుండగా ఒక తెల్లని గుర్రం అటువైపుగా వెళ్ళడం చూశారు ఇద్దరూ. ఆ అశ్వ సౌందర్యానికి ఆశ్చర్యపడ్డారు. వెంటనే కద్రువ ఆ తెల్లని గుర్రాన్ని చూసి “దాని తోక ఎంత నల్లగా ఉందో కదూ” అంది. నిజానికి ఆ గుర్రం తోక తెల్లగానే ఉంది. కద్రువ మాటలకు వింతగా చూసి వినత ‘అదేమిటి దాని తోక తెల్లగానే ఉంది కదా’ అంది. ఇద్దరికీ వాదన పెరిగింది. ఎవరి మాట నిజమైతే వారికి ఓడినవారు దాసీలుగా, బందీగా ఉండాలని షరతు పెట్టింది కద్రువ. తాను చూసిన దృశ్యం పై నమ్మకంతో వినత కూడా ఆ పందానికి ఒప్పుకుంది.
Promoted Content