
2. పూర్వం దండకారణ్య ప్రాంతం లో జరిగిన కథ
పూర్వం దండకారణ్య ప్రాంతం లో గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవారు. ఆయన తన ఆశ్రమానికి దగ్గరలో ఒక పుష్కరిణిని తవ్వించుకున్నాడు.
ఆ పుష్కరిణిలో ఎప్పుడూ సమృద్ధిగా నీరు ఉండేది. మునిపల్లె కూడా సస్యశ్యామలంగా అత్యంత సుందరంగా ఉండేది. ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని కరువు కబళించింది. సుందర ప్రకృతితో, నిరంతరం ప్రవహించే పుష్కరిణి తో, సమృద్ధిగా పెరిగిన పంటలతో అలరారే ఆ మునిపల్లె నిర్జీవమైపోయింది.
పుష్కరిణి ఎండిపోయింది. నెల బీటలువారింది. పంటలన్నీ ఎండిపోయాయి. జనం ఆకలి దప్పులతో అలమటించసాగారు.
ఈ పరిస్థితి దాదాపు పన్నెండేళ్ళు కొనసాగింది. గౌతముడు ఈ పరిస్థితికి చలించిపోయాడు.తిరిగి మునిపల్లెను సస్యశ్యామలం చేయమని వరుణ దేవుని ప్రార్థించాడు.
Promoted Content