
Bhishma Attain Moksha in Telugu
1. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు ఎప్పుడు మోక్షాన్ని పొందాడు? మోక్షం పొందిన నేల ఏమిటి?
మహాభారత కావ్యం లో అత్యున్నతమైన పాత్ర భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులనే భయభ్రాంతులకు గురిచేసిన కురువృద్ధుడు, మహావీరుడు భీష్మ పితామహుడు.
ఆయన అంపశయ్యపై 58 రోజులపాటు ఉన్నాడు. అటుతర్వాత మాఘ శుద్ధ ఏకాదశినాడు పాండవులకు ధర్మ ప్రబోధాన్నీ విష్ణు సహస్ర నామాలనీ ప్రవచించి ద్వాదశి నాడు మోక్షాన్ని పొందాడు.
ఆయన పాండవులకు విష్ణు సహస్రనామాలను చెప్పిన ప్రాంతం ఏది?
హర్యానా రాష్ట్రం లోని కురుక్షేత్ర ప్రాంతం లో నర్కాటరీ ప్రాంతం లో భీష్మునికి చిన్న గుడి ఉంది. అక్కడ భీష్మ కుండం అని ఒక నీతి చెలమ ఉంది.
భీష్ముడు అంత్యదశలో మంచినీళ్లు కావాలని అడగగా అర్జునుడు నేలలోకి బాణం వేసి నీటిని పైకి రప్పించాడనీఊ అంటారు. ఆ చోటు భీష్మ కుండం గా ఇప్పటికీ నీటితో నిండి ఉంటుంది. అర్జునుని బాణం వల్ల పైకి ఉబికి వచ్చిన గంగను ‘బాణ గంగ’ గా పిలుస్తారు. అంపశయ్యపై పడుకుని ఉన్న భీష్ముని అవతారం కూడా దర్శనమిస్తుంది.
Related Posts
రేపు – భీష్మఏకాదశి నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Bhishma Ekadasi in Telugu
Bhishma Attain Moksha in Telugu | భీష్ముడు మోక్షం పొందిన నేల గురించి మీకు తెలుసా?
https://hariome.com/significance-of-bishma-ekadasi/