శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

0
1404
Avataras of lord Ganesh
8 Incarnation of Ganesha

Like Lord Vishnu, Ganesha Also Took Incarnations?

2వినాయ‌కుడు అవ‌తారాలు (8 Avatars Of Lord Ganesha)

1. ఏకదంతుడు (Ekadantha) :

మదాసురు డనే రాక్షసుడిని చ్యవనుడనే రుషి సృష్టించడం జరిగింది. రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని పఠించడం వలన అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి మదాసురునికి తిరుగులేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని వద్దకు వెళ్ళి ఉపాయం అడుగుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెబుతారు. అప్పుడు దేవతలందరు విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తారు. అప్పుడు వారి ప్రార్ధనకి అలకించిన విఘ్నేస్వరుడు ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయిస్తాడు.

2. గజాననుడు (Gajanana):

కుబేరుని యొక్క ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఆ లోభాసురుడు శివపంచాక్షరితో పారాయణం చేసి ఆ శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే కలిగే వరాన్ని అందుకుంటాడు. అప్పుడు అతని చేష్టలకి అంతులేకుండా పోయింది. లోభాసురుడు శివుని యొక్క కైలాసాన్ని కూడా తన స్వాధీనంలో చేసుకోవాలి చూస్తారు. అప్పుడు దేవతలు అందరు రైభ్యుడనే రుషి ని శరణు కోరుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని శరణు కోరమని చెబుతారు. అలా సకల దేవతల ప్రార్థనలకు విఘ్నేశ్వరుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని ఓడిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. గజాననుడు అంటే ఏనుగు యొక్క ముఖం కలిగిన వాడు అని అర్థం.

3. వక్రతుండుడు (Vakratunda):

పూర్వం ఇంద్రుడు చేసిన తప్పు వలన మాత్సర్య సురుడు పుడతాడు. అతని రాక్షసత్వానికి ముల్లోకాలు అల్లాడిపోయిన దేవతలంతా దత్తాత్రేయుని శరణు కొరుతారు. అప్పుడు ఆయన విఘ్నేశ్వరుని ప్రార్థించమని చెప్పారు వారి ప్రార్ధనకు విఘ్నేశ్వరుడు వక్రతుండునిగా అవతరించాడు. అప్పుడు లోభాసురుడిని ఓడిస్తాడు విఘ్నేశ్వరుడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా మరియు మాత్సర్య సురుడు మనస్సులోని ఈర్ష్య ప్రతీకగా చెప్పుకోవచ్చు.

4. మహోదరుడు (Mahodarudu) :

పరమ శివుడు తపస్సు లో మునిగిపొతాడు. అప్పుడు పార్వతి దేవి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని గిరిజన యువతిగా మారుతుంది. ఆయన తపస్సుకు భంగం కలిగేలా చేస్తుంది. అప్పుడు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చి ఏం జరిగింది అన్న అయోమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడులా జన్మిస్తాడు. అతడు ముల్లోకాధిపత్యాన్ని సాదిస్తాడు. దీంతో తన ఆగడాలను అపదానికి వినాయకుడు మహోదరుడిగా అవతరించి విఘ్నేస్వరుడు తనను అంతమొందిస్తాడు..

మరిన్ని అవతార వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.