Amaravati_Amareswara_temple_gopuram_HariOme

Amaravathi Temple: 

కృష్ణానదికి దక్షిణతీరాన అమరావతిపట్టణం వెలసివుంది. పర్వదినాల్లో కృష్ణానదిలో స్నానంచేసి అమరేశ్వరస్వామిని దర్శించుకుంటే సహస్రయజ్ఞఫలం లభిస్తుందని చెప్పబడింది. స్నానము చేతనే గోదానఫలం లభిస్తుందట.

ఇచ్చట ప్రవహిస్తూన్న కృష్ణానది గంగానదికంటే నూరురెట్లు ఫలమివ్వగలదు. తీరమునకు యోజనము దూరముగల ప్రదేశ మంతయు ముక్తిక్షేత్రమే. ప్రణవేశ్వర, అగస్త్యేశ్వర, కోసలేశ్వర, సోమేశ్వర, పార్ధివేశ్వర నామములతో యిచ్చట అయిదు లింగములు గలవు.

ఇది బౌద్ధక్షేత్రము కాదని చరిత్ర పరిశోధకులు శ్రీరాయప్రోలు సుబ్రహ్మణ్యంగారు తెలిపారు.

కుమారస్వామి తారకాసురుని సంహరించు సమయమున అతని మెడలోని శివలింగమును ఛేదించగా అది ఐదుముక్కలై పెరుగుచుండెనట. అందులోనొకముక్కను యీ ప్రదేశమునందు దేవేంద్రుడు ప్రతిష్టించుటచే యిచటి శివలింగమునకు అమరేశ్వరుడని పేరు వచ్చినది. ఈ ఆలయపు రెండవ ప్రాకారములో ఉత్తరదిశగానున్నమంటపమందు 1515వ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయలవారు వెండి బంగారములతో తులాభారముతూగి ఆ ద్రవ్యమును బ్రాహ్మణులకు దానము చేసారట.

తరువాత 1796 సంవత్సరములో అప్పటి పాలకులు రాజావాసి రెడ్డివారు దారిదోపిడీదారులైన చెంచులను చంపించిన పాపమును పోగొట్టుకొనుటకు తులాభారముతూగి దానముచేసారట.

అమరావతిలో ప్రస్తుతమున్న దేవాలయము రాజావాసిరెడ్డి వేంకటాద్రినాయుడువారు నిర్మించినదే. శ్రీకృష్ణదేవరాయలవారు 1515 సంవత్సరంలో అమరేశ్వరస్వామికి ధూప దీప నైవేద్యముల నిమిత్తమై పెదమదూరు గ్రామమును దానము చేసిరట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here