మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.
1. క్షీర సాగర మథనానికి పూర్వం
క్షీర సాగర మథనానికి ముందు జరిగిన కథ ఇది. అదితి పుత్రులైన దేవతలకు, దితి కుమారులైన దైత్యులకు అంటే రాక్షసులకు కూడా అమృతం లభించలేదు.
అప్పుడు దేవతలకు మరణం అనివార్యంగా ఉండేది. సాధు స్వభావం తో సద్గుణాలతో మెలగినా దేవతలు నిష్కారణంగా అసురుల చేతిలో మరణించేవారు. పాప భీతి లేని అసురులు దేవతలను నానా హింసలకు గురిచేశారు.
యుద్ధాలలో వారు మరణించినా వారి గురువు శుక్రాచార్యుడు తన మృత సంజీవనీ విద్యతో వారిని తిరిగి బ్రతికించేవాడు. క్రమంగా దేవతల శక్తి క్షీణించసాగింది. అప్పుడు దేవగురువైన బృహస్పతి ఒక ఆలోచన చేశాడు.
Promoted Content