
How to take Theertham in the Temple in Telugu
1. తీర్థం ఎందుకు ఇస్తారు?
తీర్థం అనేది శాస్త్రప్రకారం అత్యంత పవిత్రమైనది. ఇది భగవంతుని అభిషేక జలం నుండి, పుణ్య నదుల జలాలను ఆవాహన చేసి, మంత్రోచ్ఛారణలతో శుద్ధం చేసి ఇచ్చే పవిత్ర జలం. దీని లో భగవంతుని కరుణ, అనుగ్రహం, ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. సకల తీర్తాల సారంగా ఉండే ఈ జలం కొద్దిగా సేవించినా సర్వపాపాలను తొలగించి, శరీరానికి, మనస్సుకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అది కేవలం జలమే కాదు, భగవత్ కృపాకణమని భావించాలి.
భగవంతుని పాదసంస్పర్శ పొందిన జలం లేదా అభిషేక తీర్తం ప్రాప్తి కావడం అనేది ఒక భక్తునికి అత్యంత దైవ అనుగ్రహంగా పరిగణించబడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మన లోపలి అనారోగ్యాలు, మానసిక భ్రమలు తొలగి, సత్వగుణం బలపడుతుంది. కర్మబంధాలను విడదీయడంలో ఇది ఒక ముఖ్యమైన సాధనం.
తీర్థం మూడు సార్లుగా ఎందుకు ఇస్తారు?
తీర్థాన్ని మూడుసార్లు ఇస్తారు, ఎందుకంటే ప్రతి సారి తీసుకునే తీర్థం మన జీవితంలోని మూడు స్థాయిలను శుభ్రం చేస్తుందని శాస్త్రం చెబుతుంది.
తీర్థం ఇవ్వడ సమయంలో ఈ శ్లోకాన్ని పఠిస్తారు:
శ్లో. అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం |
సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం||
అనే ఈ శ్లోకం చెబుతూ తీర్థాన్ని ఇస్తారు.ఈ శ్లోకార్థం ఏమిటంటే, పరమేశ్వరుని పాదోదకం అకాల మృతి దోషాలను తొలగిస్తుంది, అన్ని రోగాలను నయం చేస్తుంది, సకల పాపాలను హరించి శుభఫలాలను ఇస్తుంది.
-
మొదటి సారి తీసుకునే తీర్థం శరీరాన్నీ, మనసునీ శుద్ధి చేస్తుంది.
-
రెండవ సారి తీసుకునే తీర్థం సద్బుద్ధిని, న్యాయపరమైన ఆలోచనలను కలుగజేస్తుంది.
-
మూడవ సారి తీసుకునే తీర్థం మోక్ష మార్గానికి దారితీసే పరమ పునీతమైన శక్తిని ప్రసాదిస్తుంది.
ఇలా మూడుసార్లు తీసుకోవడం ద్వారా మన దేహం, మనస్సు, ఆత్మ అన్నింటిని శుద్ధిపరచడమే లక్ష్యం. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, జీవన మార్గాన్నీ సరిదిద్దే ఆధ్యాత్మిక సాధన.
తీర్థం ఎలా తీసుకోవాలి?
తీర్థం తీసుకోవడం కూడా ఒక విధమైన నిబంధనతో, శుద్ధతతో కూడిన చర్య కావాలి.
-
తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచాలి.
-
కుడిచేయి చూపుడు వేలు మధ్య భాగంలో బొటన వేలిని మడిచి, ‘గోముఖ ముద్ర’ రూపంలో చేయాలి. ఇది గోముఖం ఆకారంలో ఉంటూ, శుద్ధతకు ప్రతీక. ఈ ముద్రతోనే తీర్థాన్ని తీసుకోవాలి.
-
తీర్థాన్ని తీసుకున్న తర్వాత కొందరు తలపైన తుడుచుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే తలపై బ్రహ్మస్థానం ఉంటుంది. ఆ స్థానం అత్యంత పవిత్రమైనది. అక్కడ ఎంగిలిని రాయడం అంటే బ్రహ్మదేవునికి అపచారం చేసినట్లుగా అవుతుంది.
-
అందువలన తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని కళ్ళకు అద్దుకోవాలి. దీని ద్వారా భగవత్ కృపను దృష్టి రూపంలో స్థిరపరిస్తాం.
-
ఎట్టి పరిస్థితుల్లోనూ తలపై రాయకూడదు. అదొక శాస్త్ర విరుద్ధమైన, అశ్రద్ధాపూర్వక చర్య.
Related Stories
శంఖంలో నీటిని పోస్తే తీర్థం ఎందుకవుతుంది? | Shankha theertham significance in Telugu
Tirumala trip with 68 spots | ఈ 68 ప్రదేశాలతో మీ తిరుమల ప్రయాణాన్ని సంపూర్ణం చేసుకోండి
Mahakaleshwar Jyotirlingam | శివుడు ఆత్మలింగంగా వెలిసిన పుణ్యక్షేత్ర రహస్యం.
venkateswara swamy | కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కూర్చున్న రూపం ఎక్కడో తెలుసా!