
అట్ల తద్ది పండగ సాంప్రదాయం, విశిష్టత, వ్రతకథ, పూజా విధానం
1అట్లతద్ది నోము : 9-10-2025
ఈ ఏడాది తదియ తిది అక్టోబర్ 09, 2025న 02:22 గంటలకు ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 09, 2025న 22:54 గంటల వరకూ ఉండనుంది. ఈ నేపధ్యంలో రాత్రి సమయంలో గౌరీపూజ చేయాల్సి ఉన్నందున ఈ ఏడాది అట్లతద్దిను అక్టోబర్ 9 న గురువారం జరుపుకోనున్నారు.
అట్ల తద్ది పండగ తెలుగు ప్రజల సాంప్రదాయాలలో ఒక విశిష్టమైన పండగ. ఇది ఆశ్వయుజ మాసం బహుళ తదియనాడు జరుపుకుంటారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాలు, సౌభాగ్యాలు కోరుతూ, యువతులు మంచి భర్త కోసం ఈ పండగను జరుపుతారు. ఆచార పరంగా, ఈ పండగలో స్త్రీలు ఊయాలలూగడం, గౌరీదేవిని పూజించడం, అట్లను సమర్పించడం ముఖ్యంగా కనిపిస్తుంది.
అట్లతద్ది సంప్రదాయాలు
అట్లతద్దిని కన్నెపిల్లలు, ముత్తైదువులు తెల్లవారు జామునే నిద్రలేచి తలస్నానం చేయడం ద్వారా ఆరంభిస్తారు. ఆ రోజున సూర్యోదయం కాగానే, స్త్రీలు స్నానం చేసి అన్నం, గోంగూర పచ్చడి, పెరుగు వంటి వంటకాలను భోజనం చేస్తారు. దీని తరువాత ఉపవాసం ఆరంభమవుతుంది, అది సాయంత్రం చంద్రోదయం వరకు కొనసాగుతుంది. సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత గౌరీదేవిని పూజించి, ఉపవాసాన్ని విరుస్తారు.
ఈ పండగను జరుపుకోవడం వలన మహిళలకు సౌభాగ్యం పెరుగుతుందని, మంచి భర్త పొందుతారని విశ్వసిస్తారు. వివాహిత స్త్రీలు ఈ పండగ సందర్భంగా గోరింటాకు పెట్టడం, మెహందీ వేసుకోవడం ముఖ్యమైన సంప్రదాయాలుగా పాటిస్తారు. యువతులు కూడా పండగలో చురుకుగా పాల్గొంటారు, తద్వారా వారికి మంచి సంబంధాలు ఏర్పడతాయని నమ్మకం.
పూజా విధానం:
అట్లతద్ది పండగకు సంబంధించి గౌరీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ పూజ సమయంలో పూజా మందిరంలో పీఠం ఏర్పాటు చేసి, దానిపై బియ్యం పోసి పసుపు, కుంకుమతో గౌరీదేవిని ప్రతిష్టిస్తారు.
- పూజా పీఠం లేదా బియ్యంమీద తమలపాకు ఉంచి, పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిష్టిస్తారు.
- పసుపు, కుంకుమ, పూలు, గంధం, నీళ్లు వంటివి ఉపయోగించి, అమ్మవారికి అర్చన చేస్తారు.
- గౌరీదేవికి అట్లను మరియు ఇతర నైవేద్య పదార్థాలను సమర్పిస్తారు.
- ముగ్గురుకానీ, ఐదుగురుకాని ముత్తైదువులకు వాయినం ఇచ్చి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు.
పూజా తరువాత స్త్రీలు నిండుగా అట్లు వండుతారు. ఈ వ్రతంలో గౌరీదేవి అనుగ్రహంతో స్త్రీలకు సర్వసుఖాలు కలుగుతాయని విశ్వాసం.
అట్లతద్ది వ్రత కథ:
పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు.ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు.ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి ‘అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో’ అన్నాడు.రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి.అందుకే ఈ వ్రతానికి ‘చంద్రోదయ ఉమావ్రతం’ అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు.
ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు.
నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై” నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు” అన్నారు.
ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు.
భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.
ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు.మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.
అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. ‘అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్’ అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు.ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.
అట్లతద్ది పండగ విశిష్టత:
అట్లతద్దిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే స్త్రీలకు సర్వసౌఖ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ పండగలో స్త్రీలు నిశ్చలమైన ఉపవాసం చేసి, సాయంత్రం చంద్రుణ్ణి చూసి, అమ్మవారికి అట్లు సమర్పించి, తమ కుటుంబానికి ఆయురారోగ్యాలు కోరుకుంటారు.
- తెల్లవారు జామునే నిద్రలేచి, తలస్నానం చేస్తారు.
- సూర్యోదయానికి ముందు కడుపునిండా భోజనం చేసి, ఉపవాసం ప్రారంభిస్తారు.
- సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని చూసి, గౌరీదేవిని పూజించి, అట్లను సమర్పిస్తారు.
- ఉపవాసం విరిస్తారు.
ఆచారాలు మరియు సంప్రదాయాలు:
– వివాహిత స్త్రీలు ఈ రోజు సంప్రదాయ దుస్తులు ధరించి, మెహందీ వేయడం ప్రత్యేక విశేషం.
– ఆడపిల్లలు, వివాహిత స్త్రీలు ఈ పండగ సమయంలో ఊయాలలూగుతారు, సంప్రదాయ పాటలు పాడతారు, ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తారు.
– ఈ పండగలో 11 అట్లు, 11 రకాల ఫలాలు, 11 సార్లు తాంబూలం, మరియు 11 సార్లు ఊయల ఊగడం వంటి ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి.
అట్లతద్దిలో ప్రధానంగా వండే వంటకాలు: పల్తాలికేలు (బియ్యం పిండి, బెల్లం, పాలు), పదకొండు రకాల కూరగాయలతో సాంబారు, గోంగూర పచ్చడి వంటి ప్రత్యేక వంటకాలు.
ఈ పండగ ఆచరణ విశేషాలు:
అట్లతద్ది రోజు స్త్రీలు పార్వతీదేవిని పూజించడమే కాకుండా, ఈ పండగలో ముత్తైదువులకు వాయినం ఇవ్వడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందుతారు. గౌరీదేవి అనుగ్రహంతో కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. పదేళ్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకు సర్వసుఖాలు లభిస్తాయని నమ్మకంతో, అట్లతద్ది వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
అట్ల తద్దె పండగ తెలుగు సాంప్రదాయాల అమూల్య రత్నం, ఇది తెలుగు స్త్రీల జీవితంలో సంతోషాలు, సౌభాగ్యాలు తెచ్చే పండగ.
ఈరోజు – అట్ల తదియ, చంద్రోదదయ గౌరీవ్రతం | Atla Taddi Nomu in Telugu