12 Jyothirlinga | మీ రాశితో ముడిపడిన జ్యోతిర్లింగం ఎమిటో తెలుసా?

0
1039
Jyotirlinga to visit according to zodiac signs
Jyotirlinga to visit according to zodiac signs

12 Jyothirlingas Associated with 12 Zodiac Signs

రాశులతో ముడిపడిన ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమ

దేశంలోని ముఖ్యమైన శైవ క్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ప్రాధాన్యమున్నాయి. ఈ ఆలయాలు శతాబ్దాల కిందట నిర్మించబడి, దేవతలే వీటిని నిర్మించారని హిందువులు విశ్వసిస్తారు. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు రాశి చక్రంలోని ఒక్కో రాశితో ముడిపడి ఉన్నాయి. అందుకే తమ రాశికి చెందిన ఆలయాన్ని దర్శించడం, శ్లోకాలను పఠించడం ద్వారా దోషాలు తొలగి మంచి జరుగుతుందని నమ్మకం ఉంది.

మేషరాశి – జ్యోతిర్లింగం రామేశ్వరం

మేషరాశి కుజుడికి స్వగృహం. ఇది చరరాశి. కాబట్టి వీరికి పదకొండింట శని బాధకుడు. గ్రహపీడా నివారణార్థం ఈ రాశివారు రామేశ్వరాన్ని దర్శించి, ‘సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యే శ్రీరామ చంద్రేన సమర్పితం, రామేశ్వరాఖ్యం నియతం నమామి’ అనే శ్లోకాన్ని రోజూ పఠించాలి. శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాడని ప్రతీతి ఉంది.

వృషభరాశి – జ్యోతిర్లింగం సోమనాథ్

ఈ రాశి అధిపతి శుక్రుడు, చంద్రునికి ఉచ్ఛ రాశి. సోమనాథ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు. ఈ రాశివారు శనిదోష శాంతికి సోమనాథ దేవాలయాన్ని దర్శించి, ‘సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని రోజూ పఠించడం శుభప్రదం.

మిథునరాశి – జ్యోతిర్లింగం నాగేశ్వరం

ఇది బుధునికి నివాసస్థలం. ఈ రాశివారు గ్రహదోష పరిహారార్థం నాగేశ్వర క్షేత్రాన్ని దర్శించి, ‘యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని రోజూ పఠించాలి.

కర్కాటక రాశి – జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం

ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఓంకారేశ్వర లింగాన్ని దర్శించడం శుభప్రదం. నిత్యం ‘కావేరికా నర్మదాయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓంకార మీశం శివమేక మీధ్యే’ అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

సింహరాశి – జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వరం

సింహరాశికి అధిపతి సూర్యుడు. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శించడం మంచి ఫలితాలను అందిస్తుంది. ‘ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుంచి విముక్తి కలుగుతుంది.

కన్య రాశి – జ్యోతిర్లింగం శ్రీశైలం

ఈ రాశికి అధిపతి బుధుడు. అన్ని రకాల బాధల నుంచి ఉపశమనం పొందడానికి శ్రీశైల మల్లికార్జునుని దర్శించి, భ్రమరాంబకు కుంకుమ సమర్పించాలి. జన్మనక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవాలి. ‘శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం’ అనే శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం.

తుల రాశి – జ్యోతిర్లింగం మహాకాళేశ్వరం

ఈ రాశికి అధిపతి శుక్రుడు. మహాకాళేశ్వర దర్శనంతోపాటు శుక్రవారం సూర్యోదయ సమయంలో ‘ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం’ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుంచి విముక్తి పొందుతారు.

వృశ్చిక రాశి – జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వర

ఈ రాశికి అధిపతి అంగారకుడు (కుజుడు). వైద్యనాథేశ్వరుని దర్శించడం, ప్రతి మంగళవారం ‘పూర్వోత్తరె ప్రజ్వాలికాని ధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం తమహం నమామి’ అనే శ్లోకాన్ని పఠిస్తే శుభం జరుగుతుంది.

ధనుస్సు రాశి – జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వర

ఈ రాశికి అధిపతి బృహస్పతి. ‘సానందవనే వసంతం.. ఆనందకందం హతపాప బృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని నిరంతరం పారాయణ చేయాలి. వారణాసిని దర్శించి, గురువారం నాడు శనగల దానం చేయడం వల్ల శని, గురు గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చు.

మకర రాశి – జ్యోతిర్లింగం భీమశంకర

ఈ రాశికి అధిపతి శని. భీమశంకర దర్శనం వల్ల తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ‘యం ఢాకినీ శాకిని కాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి’ అనే శ్లోకాన్ని పారాయణ చేయడం, శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

కుంభరాశి – జ్యోతిర్లింగం కేదారేశ్వరం

ఈ రాశికి అధిపతి వరుణుడు. గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తి కోసం కేదారేశ్వర దర్శనం చేసుకోవాలి. ‘నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే’ అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి. శనివారం రుద్రాభిషేకం జరిపిస్తే మంచిది.

మీనరాశి – జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం

ఈ రాశికి అధిపతి ఇంద్రుడు. త్రయంబకేశ్వర లింగం ఎప్పుడూ నీటిలో ఉంటుంది. త్రయంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం వల్ల మేలు జరుగుతాయి. ‘నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్రయంబక మీశ మీడే’ అనే శ్లోకాన్ని పారాయణం చేయడం సకల శుభాలను కలిగిస్తుంది.

Related Posts:

Raja Yoga Horoscope | 2025లో ఈ రాశుల వారికి రాజయోగం మీ రాశి ఉంటే మీరు అద్రుష్టవంతులే

Lucky zodiac signs | శని సంచారం రోజున సూర్యగ్రహణం, ఈ రాశుల వారిదే పైచేయి

Unstoppable luck for the |2025లో రాశుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.

Astrology of 2025 | ఇప్పటి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.