
How did Dwarka sink?
1ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది? అసలు ఆ రోజు ఏం జరిగింది?
ద్వారకా నగర చరిత్ర
- హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాల్లో (చార్ధామ్) ద్వారక ఒకటి.
- ద్వారకా అనేక ద్వారాలు కలది అని అర్థం.
- వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు.
- శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు.
- మగధరాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు.
- శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకాకు తరలించాడు.
- సముద్ర గర్భంలోని దీవుల సమూహాలను కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు.
- అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు.
- ద్వారకను పాలించిన యాదవులను ‘దశరాస్’ అంటారు.
కట్టడాలు మహాద్భుతం
- గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు.
- నగరాన్ని ఆరు విభాగాలు చేశారు.
- నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది.
- రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ.
- కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్రగర్భంలో కలిసి పోయింది.
శ్రీకృష్ణుడు నిర్యాణంతో
- మహాభారత యుద్ధం క్రీ.పూ. 3138లో జరిగింది.
- ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు.
- యాదవ రాజులు పరస్పరం కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైంది.
- యాదవకులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది.
- బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు.
- కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళి స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలో ఉంది.
- కొంతమంది పురాణాల ప్రకారం, కృష్ణుడు ఒక బోయవాడి బాణం వలన గాయపడి దేహాన్ని త్యజించాడు.
- కృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది.
- కృష్ణుడి నిర్యాణం తరువాత, సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తింది.
ఆ రోజు ఏం జరిగింది?
- ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి.
- ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలైంది.
- శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు.
- కృష్ణుడి పిలుపు మేరకు ద్వారాకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు.
- మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిపోనుందని తెలిపాడు.
- ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు.
- అర్జునుడు ద్వారక ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించాడు.
- వారిక వెళ్లిన తర్వాత సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు.
- సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడి, క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తింది.
పరిశోధనలు ఏమంటున్నాయి?
- ద్వారకాపురి క్రీ.పూ. 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
- గుజరాత్లోని జామ్నగర్ సముద్రతీరంలో ఆనవాళ్లు లభించాయి.
- 1983-86లో గుజరాత్ సముద్రతీరంలో జరిగిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి
- గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు.
- ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ ఎస్.ఆర్. రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో, ద్వారకా నగరం క్రీ.పూ. 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు.
- గుజరాత్ తీరం నుంచి 20 కి.మీ. దూరంలో సముద్ర గర్భంలో 40 మీ. లోతులో సుమారు 9 చ.కి.మీ. వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు.
- 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలను సేకరించారు.
- ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి.
- ఓ మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం అద్భుతం.
Related Posts
Srisailam wish fulfilling tree | కోరికలు నేరవేర్చే ఈ చెట్టు ఇక్కడి ప్రత్యేకత
Mysterious Shiva Temple | నేటికీ సైన్స్కు సవాల్, ఈ శివాలయంలో గడ్డ కట్టే చలిలో కూడా మరిగే నీరు.
Mysteries Temple | నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం, అద్భుతం చూసేందుకు పోటెత్తే భక్తులు
Mystery of the Talking Idols | ఈ గుడిలో అమ్మవారి విగ్రహాలు మాటలాడతాయట! పరిశోధనల్లో ఏం తేలిందంటే.