
The Story of Karthika deepam that resembles Ardhanareeswara:
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం ఒక కీలక ఘట్టం.
అర్ధనారీశ్వరుడి కథలో భాగం: (Lord Shiva and Devi as Ardhanarishwara’s)
ఒకసారి పార్వతీదేవి సరదాగా పరమేశ్వరుడి కన్నులను మూసివేయగా, ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. ఈ సంఘటనకు ప్రాయశ్చిత్తం చేయడానికి పార్వతీదేవి సిద్ధమయ్యారు. ఆమె ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి భక్తి, తపస్సు ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలని సంకల్పించుకుంది. శివుని అర్ధాంగిగా మారడానికి, తిరువణ్ణామలైలో తీవ్ర తపస్సు చేశారు.
ఈ సమయంలో మఖిదాసురుడు అనే రాక్షసుడు ఆమె తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించాడు. రాక్షసుని దుశ్శక్తులను సమూలంగా నాశనం చేయడానికి పార్వతీదేవి దుర్గాదేవి రూపాన్ని ధరించి, కార్తీక మాస పౌర్ణమి నాడు అతన్ని సంహరించారు.
ఆ తరువాత, శివుడు పవిత్ర జ్యోతి స్వరూపంలో తిరువణ్ణామలై పర్వతంపై ప్రత్యక్షమై, పార్వతీదేవిని తన అర్ధాంగిగా స్వీకరించారు.
కార్తీక దీపొత్సవం జపుకొవడానికి కారణంగా చెప్పే ఇంకొ కధ: (War between Bramha and Vishnu)
బ్రహ్మ వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో తగువుకు దిగుతాడు. ఎవరు గొప్పవాడో అనేది ఇద్దరూ వాదించుకుంటారు. వీరి తగువు తీవ్రంగా మారి యుద్ధంలోకి దారితీస్తుంది. దేవతలు ఈ యుద్ధాన్ని ఆపించేందుకు శివుని సహాయం కోరతారు. శివుడు పెద్ద అగ్నిస్థంభం రూపంలో ప్రత్యక్షమైయీ యుద్ధాన్ని ఆపుతాడు. బ్రహ్మ, విష్ణువులు ఆ అగ్నిస్థంభం ఆది, అంతాల్ని కనుక్కోలేక తమ తప్పును గ్రహిస్తారు. బ్రహ్మ తప్పుడు సాక్ష్యంతో అగ్రం చూశానని చెప్పాడు. బ్రహ్మ దొషాన్ని గుర్తించిన శివుడు విష్ణువు వినయాన్ని క్షమించి, భూలోకంలో ఆయన పూజలు జరగాలని వరం ఇస్తాడు.
తదుపరి సన్నివేశంలో, బ్రహ్మ దొషాన్ని శిక్షించేందుకు శివుడు భైరవుణ్ణి పంపుతాడు. భైరవుడు బ్రహ్మ ఒక తలను ఖండిస్తాడు. విష్ణువు శివుని బ్రహ్మను క్షమించాలని ప్రార్థిస్తాడు. శివుడు బ్రహ్మను క్షమిస్తాడు కానీ భూలోకంలో ఆయనకు పూజలు జరగవని శపిస్తాడు. అదే సమయంలో, మొగిలిపువ్వు అసత్యానికి సాక్ష్యంగా ఉన్నందుకు శాపం పొందుతుంది. కానీ భక్తులు ధరిస్తే అది నిజన్మ సఫలం అవుతుందని వరం ఇస్తాడు. ఇలా, శివుడు తన దయను, సర్వాధికారాన్ని ప్రదర్శించి, దేవతలందరి ప్రీతిపాత్రుడుగా నిలుస్తాడు.
అరుణాచల వైభవం: (Glory of Arunachalam )
ఈ విధంగా పరమేశ్వరుడు కొలువుదీరి బ్రహ్మ, విష్ణువుల పూజలు స్వీకరిస్తాడు. ఈ సందర్భంగా శివుడు శివరాత్రి విశిష్టతను వివరించి, ఆ రోజున శివలింగాన్ని పూజించడం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెప్పాడు. బ్రహ్మ, విష్ణువుల మధ్య జరిగిన యుద్ధంలో అగ్నిస్తంభం రూపంలో కనిపించిన శివుడు ఆ లింగాన్ని ఆరాధించే వారికి భోగం, మోక్షం కలుగుతాయని, ఆ లింగం పేరుతో ఆ ప్రదేశం ‘అరుణాచల క్షేత్రం’గా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు.
ఈ ముక్తి క్షేత్రంలో పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని, భక్తులకు సాలొక్యం, సారూప్యం, సాయుజ్యం అనే దివ్య ఫలితాలు లభిస్తాయని, అక్కడ నివసించిన, తపస్సు చేసినవాళ్ళు ముక్తి పొందుతారని శివుడు ప్రకటించాడు.
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం విశేషాలు:
భరణి దీపం:
కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు, అన్నామలైయార్ ఆలయ గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. వేద మంత్రోచ్ఛారణలతో ఈ దీపం దివ్యమైన కాంతి శక్తిని సూచిస్తుంది. ఇది శివుని సార్వత్రికతను గుర్తు చేస్తుంది.
పంజరథ రథోత్సవం:
మహాదేవుని మరియు నిన్నములై అమ్మవారిని రకరకాల పూలతో అలంకరించిన రథాల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమివ్వడం పండుగకు ప్రత్యేకత.
మహాదీపం:
- కార్తీక పౌర్ణమి సాయంత్రం 6 గంటలకు, 2,668 అడుగుల ఎత్తయిన అరుణాచల కొండపై మహాదీపం వెలిగిస్తారు.
- ఈ దీపం కోసం 3,500 కిలోల నెయ్యి, వెయ్యి మీటర్ల ఖాదీ వస్త్రాలను ఉపయోగిస్తారు.
భక్తుల శివనామస్మరణల మధ్య దీపాన్ని కొండపైకి తీసుకెళ్లి వెలిగించడం ఈ వేడుక ప్రధాన ఘట్టం.
దీపాల అలంకరణ:
గిరిప్రదక్షిణ చేయడానికి లక్షలాది భక్తులు వస్తారు. గిరుల చుట్టూ దీపాల వెలుగులు భక్తుల హృదయాలను దివ్యమయంగా చేస్తాయి.
కార్తీక దీపం అర్ధనారీశ్వర తత్వానికి అన్వయము:
జ్యోతి స్వరూపం:
శివుడు అనంతమైన జ్వాల రూపంలో దర్శనమివ్వడం, పార్వతీదేవి ఆయనతో ఏకమవడం అర్ధనారీశ్వర తత్వాన్ని ఉద్భవింపజేసింది.
ఇది పురుష మరియు స్త్రీ శక్తుల సమతుల్యత, సృష్టిలోని ఏకత్వాన్ని సూచిస్తుంది.
కాంతి విజయాన్ని సూచించడం:
కార్తీక దీపోత్సవం ద్వారా చీకటిపై కాంతి, అవిద్యపై జ్ఞానం, దుశక్తులపై దైవ శక్తి విజయాన్ని జరుపుకుంటారు.
Related Posts
2025 Arunachalam Pournami Giri Pradakshina Dates | అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు