Ayyappa Swami rituals| కుటుంబంలో మరణం జరిగితే, స్వామి మాలను కొనసాగించాలా?

0
397

Ayyappa Maala Rituals
Ayyappa mala rituals to be followed

Will it be continued if a family member dies while wearing the Ayyappa Swami Mala?

1అయప్ప స్వామి మాల ధరించిన సమయంలో కుటుంబంలో ఎవరైనా  మరణిస్తే, ఆ మాలను కొనసాగించాలా లేదా?

ఆయప్ప స్వామి మాల ధరించే ప్రాముఖ్యత:
ఆయప్ప స్వామి మాల ధరించడం భక్తుల జీవితంలో ఒక పవిత్ర ఆచారం. దీని ద్వారా భక్తులు తమ జీవితంలో శాంతిని, నిబద్ధతను, ధర్మాన్ని పాటించే అవకాశం పొందుతారు. మాల ధరించేటప్పుడు ప్రతిరోజూ నిత్య పూజలు చేయడం, నియమాలను కచ్చితంగా పాటించడం, భగవంతుడి పట్ల సంపూర్ణ నమ్మకాన్ని ప్రదర్శించడం వంటి పద్ధతులు అనుసరించబడతాయి. అయితే, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, భక్తులు ఏమి చేయాలో అని చాల మందికి అనుమానాలు వస్తూఉంటాయి. ఇలాంటివి ఎవరికి రాకూడదు అని మేము ఆ అయ్యప్పస్వామిని కోరుకుంటున్నాము!..

మాల ధరించే సమయంలో మరణం జరిగితే ఎలా వ్యవహరించాలి?

భక్తులు మాల ధరించిన సమయంలో కుటుంబంలో మరణం జరిగితే, కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది:

తల్లిదండ్రులు మరణిస్తే: ఒక సంవత్సరం పాటు మాలను  తీసెయ్యాలి ఆ తరువాత మల్లి మాల వేసుకోవచ్చు .

భార్య మరణిస్తే: ఒక సంవత్సరం పాటు మాల ధారణ నిలిపివేయాలి.

తోబుట్టువులు మరణిస్తే: ఆరు నెలల పాటు మాలను ఆపడం అవసరం.

దాయాదులు లేదా బంధువులు మరణిస్తే: 13 రోజులు మాల తీసేసి . ఆ తర్వాత మాల ధరిస్తే యాత్రను తిరిగి ప్రారంభించవచ్చు.

మరణం జరిగితే పూజలను ఆపాల్సిన అవసరముందా?

భక్తుల నమ్మకం ప్రకారం, పూజలు ఆపడం అనవసరం. 13వ రోజు నిర్వహించే మృతుల ఆచారాల తర్వాత దేవాలయంలో పూజలు ప్రారంభించడం మంచిదని భావించవచ్చు. పూజలు మన ధార్మిక విధి, భగవంతుని పట్ల మన భక్తిని వ్యక్తీకరించే సాధనం.

యాత్రకు పునఃప్రారంభం: మరణం జరిగిన 13 రోజుల తర్వాత భక్తులు మాలను తిరిగి ధరించి యాత్రకు పునఃప్రారంభం చేయవచ్చు. అయితే, ఇది పూర్తిగా భక్తుని నిబద్ధత, కుటుంబ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

భక్తులు గమనించాల్సిన ముఖ్య విషయాలు

పవిత్రతకు ప్రాధాన్యత: భక్తులు నిత్య పూజలు చేయడం, భగవంతుని పట్ల సమర్పణ భావంతో ఉండడం అవసరం.

సంఘ ఆచారాల పాటించండి: కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా, సంప్రదాయాలను పాటించడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు.

భగవంతుని ఆశీర్వాదాలు: మరణం జరిగినపటికీ, పూజలు చేయడం ద్వారా భగవంతుని ఆశీర్వాదాలను పొందవచ్చు. కొన్ని రోజుల పాటు దానికి సంబంధించిన ఆచారాలు పాటించి తరువాత యధావిధిగా పూజలు చేసుకోవచ్చు.

యాత్ర సమాప్తి: మాల ధరించిన సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, యాత్రను కొనసాగించే విషయంపై గురుస్వామి లేదా పెద్దల సూచనను పాటించాలి.

మరణం జరిగిన తరువాత ఆధ్యాత్మిక నియమాలు పాటించడం

భక్తులు కుటుంబ సభ్యుల మరణం తర్వాత కొన్ని నియమాలు పాటించడం ద్వారా భగవంతునికి మరింత చేరువవుతారు. పూజలు, దానం, భజనలు, జపం చేయడం వంటి పనులను కొనసాగించడం ఉత్తమం.

మాల ధరించడం ద్వారా ఆధ్యాత్మిక లాభాలు
ఆయప్ప స్వామి మాల ధరించడం ద్వారా భక్తులు అనేక లాభాలను పొందుతారు:

మానసిక శాంతి: భగవంతుని స్మరణ ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

ఆధ్యాత్మిక నిబద్ధత: రోజూ పూజలు చేయడం, నియమాలు పాటించడం ద్వారా భక్తి పరిపూర్ణమవుతుంది.

సమాజానికి సేవ: సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సమాజానికి కూడా లాభం కలుగుతుంది.

సంకల్పాన్ని నిలుపుకోవడం
మాల ధరించినపుడు సంకల్పాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమైంది. కుటుంబ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, భగవంతుని పట్ల భక్తిని, విశ్వాసాన్ని కోల్పోకూడదు. మీరు ఇవన్నీ చేయటం వల్ల మీకే ఎంతో లాభం మరియు మంచి జరుగుతుంది.

మరణం జరిగినపుడు భగవంతుని ఆశీర్వాదం పొందడం
భక్తులు మరణం జరిగినప్పటికీ భగవంతుని ఆశీర్వాదం పొందడానికి పూజలు చేయడం, నియమాలు పాటించడం ద్వారా తమ జీవితంలో కొత్త మార్గాలను కనుగొనవచ్చు.

కాబట్టి మీరు ఎవరో ఎక్కడో చనిపోయారు అని ఒక సంవత్సరం పాటు పూజలు, వ్రతాలు ఆపాలిసిన పనిలేదు. ఇలా అన్ని రోజులు దేవునికి మన సంస్కృతికి దూరంగా ఉండటం అంత మంచిది కాదు ఇంట్లో కళ పోయి దారుణంగా ఉంటుంది.. మీరు మీ కుటుంబం అంతా ఎప్పుడూ ఆనందంగా ఉంటూ మన సంప్రదాయాలు ముందుకు తీసుకువెళ్లాలి అని మా హరిఓం బృందం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం!

హరిఓం ఫాలో అవడం ద్వారా మీకు ఆధ్యాత్మిక, సాంప్రదాయ సమాచారాన్ని నిరంతరం అందించబడుతుంది. ఇప్పుడే 9059-777-789 కి “హరిఓం” అని మెసేజ్ చేయండి…….

 

 

Related Posts

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం పూజ సమయాలు | Sabarimala Ayyappa Temple Puja Timing

అయ్యప్ప జననం & విగ్రహ రహస్యం | Birth History of Lord Ayyappa

Sri Kiratha (Ayyappa) Ashtakam Lyrics in Telugu | శ్రీ కిరాతాష్టకం

అయ్యప్ప స్వామివారి మోకాళ్ల ఎందుకు కట్టి ఉంటాయో తెలుసా? | Why did Lord Ayyappa Swamy legs tied in Telugu