
Dhanurmasa Significance
1ధనుర్మాస విశిష్టత
ప్రతి హిందువు గృహస్థ జీవితం దేవతారాధనతో ముడిపడి ఉంది. కొన్ని మాసాలలో వచ్చే ఆరాధన కొన్ని ఇంట్లో చేసుకునేవిగా ఉంటాయి మరి కొన్ని దేవాలయ సంప్రదాయ ఉత్సవాలకు మాత్రమే సంబంధినవిగా ఉంటాయి.
అదేవిధంగా ధనుర్మాసంలో వచ్చే శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతం. ఈవ్రత సమయంలో వైష్ణవల ఇంట్లో అదేవిధంగా వైష్ణవ ఆలయాల్లో దీపం ప్రజ్వరిల్లుతుంది. గోదాదేవిగా ప్రశస్తిగాంచిన ఆండాళ్ తల్లి రచించిన పాశురాలలోని సారంశమే మార్గశీర్ష ధనుర్మాస వ్రతం.
ఈ వ్రతం తమిళనాడు రాష్ట్రంలో చాలా వైభవంగా చేసుకుంటారు. దీనినే తమిళులు “పావైనోంబు” అని పిలుస్తారు. ఇది ఆంగ్ల నెలల ప్రకారం డిసెంబర్ లేదా జనవరి నెలలో చేసుకుంటారు.
శ్రీ ఆండళ్ తల్లి చెప్పినట్టు ధనుర్మాస వైభవాన్ని 3 కోణాల్లో దర్శించుకోవచ్చు. అవి,
1. ప్రకృతి రమణీయకం.
2. మానవుని నైమిత్తిక జీవిత వృత్తి.
3. ఆధ్యాత్మిక మార్గోపదేశం.
ఈ 3 ఒకదానికోకటి సంభంధం కలిగి ఉంటాయి. మన పూర్వికులు సూర్యోదయానికి గంటన్నర ముందుని బ్రహ్మ ముహూర్తంగా చెప్పారు. ఈ సమయం దేవతల ఉపాసనకు, ధ్యానం, యోగ అభ్యాసాలకు సముచితమైన సమయం. ఈ సమయం ఎలా ఉంటుంది అంటే, మంచు తెరలు కమ్ముకున్న ఆకాశం, అతి చల్లని చిరు గాలి మన శరీరానికి హాయిని కలిగించే స్పర్శానుభవం.
ధనుర్మాసం కథ (The Story of Dhanurmasam)
ధనుర్మాసం కాలం నందు దక్షిణాయనంలో దేవలోకవాసులందరు కలిసి శ్రీ మహావిష్ణువుని స్తుతించారు. అప్పుడు శ్రీవారు ప్రత్యక్షమవ్వగా “రాత్రి చీకటి తమ స్థానాలకు వెళ్ళకుండా ఇబ్బంది పెడుతుందని మొరపెట్టుకున్నారు. అప్పుడు చీకటికి అధిదేవత అయిన రాత్రి దేవత శరణు కోరి ఇల స్వామివారికి విన్నవించుకుంది “స్వామి, ప్రజలందరు దక్షిణాయనాన్ని ఒక అశుభమైందిగా భావించి శుభకార్యాలు చేసుకోవటం లేదు. నాన్ను అందరు దూషిస్తున్నారు. దీనికి పరిష్కార మార్గం తెలియకపోతే నేను ఈ నిందతోనే జీవితం చాలించుకుంటాను” అని భాధపడింది. అప్పుడు భగవంతుడు కొన్ని షరతులతో కూడిన వరాన్ని రాత్రి దేవికి ఇచ్చాడు. “నీ కాలం రెందేసి నెలలతో మూడు ఋతువులుగా ఉండి మొదటి రెండు ఋతువులు నాకు ప్రీతిప్రధమై ఉంటాయి. ఇందులో వచ్చే కార్తీకం, ఆశ్వయుజం, భాద్రపదం మరియు శ్రావణం చాలా శ్రేష్ఠమైనవి. ఈ మాసాల్లో చేసే పూజలన్ని విశిష్ఠ ఫలాలని ఇస్తాయి. అందుకే ఈ కాలాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. అప్పుడు నీపైన ఉన్న నింద తొలగిపోతుంది” అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు.
ఈ కథను బట్టి శ్రీ మహావిష్ణువే కాలలను & ఋతువులను నియమం చేశాడనే విషయం స్పష్టమవుతుంది. 12 మాసాలె శ్రీ మహావిష్ణువు 12 నామాలు అని అందులో ధనుర్మాసం సంబంధించిన నామ “కేశవ” అని శ్రీవారే స్వయంగా చెప్పారని పురాణాల్లో ఉంది.
వైష్ణవ అచారల్ని అనుకరించే వాళ్ళు నిత్యం విష్ణువు ఆలయాల్లో ఉంటూ తమ శరీర భాగాల్లో ఎక్కడైన 12 స్థానాల్లో ఊర్ధ్వపుండ్రాలు ఖచ్చితంగా ధరించి ఒక్కోక్క పుండ్రానికి శ్రీమన్నారాయణుని ద్వాదశనామాలను ధ్యానిస్తూ ఉంటారు. దీని గురుంచి నమ్మళ్వారు తమ తిరువాయ్ మోళిలో వివరించారు.
శ్రీ మహావిష్ణువు నామాల్లో “కేశవ”కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? (What is the Significance of “Kesava” in Lord Vishnu’s Names?)
శ్రీ మహావిష్ణువు నామాల్లో కూడా “కేశవ” నామమే ప్రధమం. కేశవ శబ్ధానికి గల వ్యుత్పత్తులు మూడు అవి,
కేశవః = శోభనాః కేశాః యస్య సః – మంచి కేశాలు కలవాడు.
కేశినం అసురం హతవాన్ ఇతి – కేశి అనే రాక్షసుణ్ణి చంపినవాడు.
క శ్చ ఈశ శ్చ కేశౌ, తావస్మిన్ స్తు ఇతి – బ్రహ్మరుద్రులు ఈయనయందే జన్మించారు. అంటే బ్రహ్మవిష్ణురుద్రుల కలయికే కేశవ స్వరూపం అని అర్ధం.
ఈ నామ జపం వల్ల ఏడు తరాల వారికి ఇటు అటు మోక్షం ప్రాప్తిస్తుందని ప్రతీది. ఇంతటి ప్రాస్త్యత్యం కలిగిన కేశవ నామం ధనుర్మాసానికి అంకితం. ఈ విషయాలని గ్రహించి ప్రతి హిందువు ధనుర్మాస వ్రతాన్ని తన శక్తి కొలది ఆచరించి ఆ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు పొంది ఆయన కృపతో సర్వ శ్రేయస్సులూ పొందాలని మా మనవి.
ధనుర్మాసంలో ఆచరించవలసిన విధులు (Duties to be Performed in Dhanurmasam)
ఈ మాసంలో మన పూర్వికులు ఆచరించవలసిన నైమిత్తిక విధుల్ని నిర్దేశించారు. ఈ మాసంలో వచ్చే మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి చాల విశిష్ఠమైనది. ఈ కాలం సర్వ సంపదలతో భగవంతుని సంపూర్ణ అనుగ్రహం కలిగినది.
గోదా దేవి ప్రభాత కాలంలో నిద్ర లేచి ఇంటి పక్కన ఉన్న తన సమ వయస్కులైన కన్నె పిల్లల్ని నిద్రలో నుంచి మెల్కోలిపుతుంది. తర్వాత అందరు కలిసి కోనేటి స్నానం ఆచరించి వ్రతాన్ని నోముకోవాలి.
ధనుర్మాస వ్రతాన్ని ఎందుకు చేసుకుంటారు? (Why do Dhanurmasa Vrat?)
కన్నె పిల్లలే ఎందుకు నోముకుంటారు అంటే, తమని భాగ చూసుకునే ప్రాణసఖుడు వస్తాడని కాత్యాయనిని ఉద్దేశించి చేసే వ్రతం అని పురాణోక్తి. శ్రీ ఆండాళ్ అమ్మవారు తన ప్రాణవల్లభుడైన శ్రీ కృష్ణుని కోరకై ఆచరించి పాటలు పాడింది.
ధనుర్మాసం వ్రతం నియమనిష్టలు (Dhanurmasam Fasting Rules)
1. బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు ముగించుకోవాలి.
2. పాలు లేదా నేయ్యి వంటివి తీసుకోవాలి.
3. అలంకరణలు చేసుకోకూడదు. పూలు కూడా పెట్టుకోకూడదు.
4. గడుసు పనులు చేయకూడదు అదే విధంగా ఎవరిని నిందించకూడదు.
మార్గశీర్ష మాసం శ్రీకృష్ణునికై ఉద్దేశింపబడింది. ప్రజలందరిని ఏకసూత్రంతో బంధింప గల ప్రణయతత్వానికి చక్కనైన సమయం ఇది. అందుకే శ్రీ కృష్ణుడే స్వయంగా “మాసాలలో మార్గశీర్శం నేను” అని భగవత్గీతలో చెప్పాడు.
ధనుర్మాసంలో ప్రఖ్యాత విష్ణువు ఆలయాల్లో 21 రోజుల పాటు ఉత్సవాలను నాలుగు వేల దివ్య ప్రబంధాలు వాసిగాంచి, పంటెండు (12) ఆళ్వారులు రచించిన పాశురాల్ని సృతిలయలతో పటిస్తు జరుపుతారు. వైకుంఠ ఏకదశి పూర్వపరంగా ఈ ఆధ్యాయనోత్సవాలు జరుపుకుంటారు. పదవ రోజు వైకుంఠ ఏకదశి తవాత స్వర్గ ద్వారం తెరవబడుతుంది.
ఇకపోతే ఆధ్యత్మపరంగా చూసుకుంటే మాయ నిద్రలో ఉన్న సమస్త జీవులను ఆచార్యుడు తట్టి లేపటమే “తిరుప్పావై”లోని నిగుడార్ధం. ఇలాంటి ప్రతి విషయంలో అంతరార్ధం ఇమిడ్చి పురాణ కథలుగా మన పండితులు తత్వార్ధాలను అందించారు.
————- హరి ఓం
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
Related Stories
ధనుర్మాస వ్రత విధానం & నియమాలు | Dhanurmasa Vratham Puja Vidhi & Rules
Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య