
Famous Shani Temples To Get Rid of Shani Dosha
1శని దోషం నుండి బయటపడటానికి ప్రసిద్ధ శని దేవాలయాలు
ఈ దేవాలయాలను దర్శించుకోవడంతో మీకు ఉన్న శని దోషాలు తొలగిపోతాయి..!!
హిందూ పురాణాల ప్రకారం అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరైన శని దేవుడు దేశంలో విస్తృతంగా ఆరాధించబడతారు . ఈయన సూర్యుడు మరియు ఛాయల దేవి కుమారుడు. శని దేవుడు కర్మ మరియు న్యాయం యొక్క దేవుడు అని నమ్ముతారు. మానవులు తాము చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటారు. అలాంటి పరిస్థితిలో శని దోషాన్ని తొలగించుకొవడనికి జ్యోతిష్య శాస్త్రంలోనే అనేక నివారణలు, పరిహారాలు, పుజలు చేయడం జరిగింది.
జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే జీవితంలో అన్ని పనులు సాఫీగా జరుగుతాయి. అలా కాకుండా శని దృష్టి పడినట్లైతే మీ యొక్క ప్రతి ప్రయత్నం విఫలమే అవుతుంది అని చెపుతారు. శని దోష నివారణకు మన దేశంలో చాలా ప్రదేశాలలో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 5 దేవాలయాల ను దర్శించుకొవడం వల్ల శని దోషలు తొలగిపోతాయి అని నమ్ముతారు. ఆ ఆలయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతదేశంలోని శనీశ్వరుని ఆలయాల జాబితా (List of Shani Dev Temples in India)
1. శని సింగనాపూర్, మహారాష్ట్ర (Shani Shingnapur, Maharashtra) :
శని శింగనాపూర్ (మహారాష్ట్ర) శనీశ్వరుడు ప్రస్తావన వచ్చినప్పుడు గుర్తుకు వచ్చేది శని శింగనాపూర్ దేవాలయం పేరు. ఈ ప్రధాన శని దేవాలయం మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లా శింగనాపూర్ గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి దేశ వ్యాప్తంగా ప్రధాన ప్రాముఖ్యత ఉంది. దేశం నలుమూలల నుండి భక్తులు దర్శనం కొరకు తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది అది ఏమిటంటే. శనీశ్వరుడిని దర్షించడం ద్వారా ఏలినాటి, ధైయా పరిస్థితి నుంచి విముక్తి పొందుతారు . ఈ గ్రామంలో ఇల్లులకు తలుపులు ఉండవు. శనిదేవుని యొక్క మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని ప్రజల బాగా నమ్ముతారు.
2. శని మందిరం, కర్ణాటక (Sri Shathya Shaneswara Swami Temple):
ఈ శని దేవుడు దేవాలయం తుమకూరు జిల్లా కర్నాటక రాష్ట్రంలో ఉంది. ఈ గుడి ప్రత్యేకత చెప్పలంటె ఇక్కడ శనీశ్వరుడు వాహనం. ఇయన కాకిపై కూర్చుని ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శని దేవుడిని పూజిస్తే శని దోషం వారి జాతక నియమంలో ఉన్న దోషం పోతుందని అని నమ్ముతారు. వేలాది భక్తులు నమ్మకంతో దర్శనం కొరకు తరలి ఆలయానికి వస్తుంటారు.
3. శని ధామ్ ఆలయం, ఢిల్లీ (Shani Dham Temple):
శని ధామ్ దేవాలయం ఇది మరో ప్రసిద్ధకరమైన శనీశ్వరుడు ఆలయం. ఇది దేశ రాజధాని ఢిల్లీలో ఛతర్పూర్ గ్రామంలో ఉంది. ఇక్కడ శనీశ్వరుడు విగ్రహం అత్యంత ఎత్తున ఉండటం మనం చూడవచ్చు. దూర ప్రాంతాల నుంచి శనిదేవుడిని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ గుడిని సందర్శించడం వల్ల శనిదోషం నుంచి విముక్తులు అవుతారు అని ప్రజలు చాలా నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం ఆచరించి శనీశ్వరుడికి ఆవాల నూనె సమర్పిస్తారు.
4. కోకిలవ ధామ్ ఉత్తరప్రదేశ్ (Kokilavan Dham Shani Dev Mandir):
ఈ ప్రతిష్ట దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర జిల్లాలో కృష్ణాపట్టణంలో ఉంది. ఈ దేవాలయాన్ని కోసిలోని కోకిలావనంగా పిలుస్తారు. ఈ ఆలయంలో ఏడు శనివారాలు నిరంతరం శని దేవుడికి ఆవనూనె సమర్పిస్తే శనిదోషం తొలగిపోతుందని ప్రజల నమ్మకం. ఇక్కడ తైలం సమర్పించుకొని మనస్ఫూర్తిగా ప్రార్దిస్తే మనకి ఉన్న అన్ని శని దోషం తొలగిపోతుందని భక్తులు చాలా నమ్ముతారు. శ్రీక్రిష్ణుడు ఈ ప్రాంతంలో కోకిల రూపంలో శనీశ్వరుడుకి దర్శనమిచ్చినందున ఈ దేవాలయాన్ని కోకిలవనం అని పిలుస్తారు.
5. తిరునల్లారు దేవాలయం, తమిళనాడు (Thirunallar Shani Temple):
ఈ శనీశ్వరుడు దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది రెండు నదుల మధ్యలో ఉంటుంది. ఇక్కడ శనిదేవుతో పాటు శివుడిని కూడా పూజిస్తే శనిదోషం పోతుందని ప్రజలు బాగా నమ్ముతారు.
Spiritual Related Posts
శ్రీ మహాలక్ష్మీ కటక్షంతో ఈ రాశుల వారికి మహర్దశ | Mahalakshmi Special Blessings on These Zodiac Signs
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings
తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals