
Kanipakam Sri Varasiddi Vinayaka Swamy Temple
1కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఉంది. తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా ఈ ఆలయాలు సందర్శిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు వినాయకుడి గుడి అంటే ముందు గుర్తు వచ్చేది కాణిపాకం. కాణిపాకం క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి తానే స్వయంభూగా వెలశాడు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఎవరు ప్రతిష్టించలేదు. ఈ కారణం చేత స్వయంభూగా ప్రసిద్ధి చెందారు.
కాణిపాకం వినాయకుని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉండటం విశేషం. స్వామి వారికి క్రితం వెండి కవచం 50 సంవత్సరాల క్రితం ఉండేది. వినాయకుని విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
కాణిపాకం వినాయకుడి ఆలయం పురాణ గాథ (Kanipakam Temple History)
కాణిపాకం అంటే అర్థం ఏమిటి అంటే వ్యవసాయ భూమిలో నీరు ప్రవహిస్తున్న అని అర్థం. పురాణ గాథ ప్రకారం ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండేవారు. ఒకరు మూగ, ఒకరు గుడ్డి, మరొకరికి చెవుడు. వారు తమ పొలంలో సాగు చేస్తు జీవనం సాగించేవారు. పొలం కోసం నీరు తోడుతుండగా ఒకనాడు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. నీరు కోసం ఒక్కరు నూతిలో త్రవ్వటం మొదలు పెట్టాడు. గడ్డపారకు రాయిలాంటి తగలటంతో ఏంటి అని చూస్తే నల్లని రాతికి రక్తం కారడం గమనించారు. నూతిలో నీరు పూర్తిగా రక్తం రంగులో మారిపోయింది. వెంటనే స్వామి వారిని వేడుకున్నారు. వారి పూజ వల్ల ముగ్గిరి అవిటితనం పోయింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్థులు నూతి లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు కాని ప్రయత్నం ఫలించకుండానే స్వయంభూ విగ్రహం వినాయక స్వామి నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ గ్రహించి ప్రజలు కొబ్బరికాయలు, నీటితో వినాయకుడికి అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు చిన్న కాలువలా ప్రవహించింది. అందుకే కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. కాలక్రమేణ కాణిపాకంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి విగ్రహం నూతిలో ఉంటుంది.
కాణిపాకం వినాయకుడి ఆలయం ఎవరు కట్టించారు? (Who Built Kanipakam Ganesha Temple?)
11వ శతాబ్దం చోళ రాజు మొదటి కుళోత్తుంగ చోళుడు కాణిపాకం వినాయకుడి ఆలయం నిర్మించాడు. విజయనగర సంస్థాన చక్రవర్తులు 1336 సంవత్సరం తర్వాత పాలకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిర్వహణ చేస్తున్నారు.
ఈ దేవాలయంలో నాయక చవితి పండగ ఒక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 21 రోజుల పాటు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చుడానికి కోసం భక్తులు తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తారు.
Spiritual Related Posts
తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals
https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/