శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam

0
1177
Erukumamba Temple Visakhapatnam
Erukumamba Temple Vizag

Erukumamba Temple Amma Idol Has No Head

1ఎరుకుమాంబ ఆలయ అమ్మవారి విగ్రహానికి తల లేదు!

హిందు ఆలయాలు అంటే ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. రహస్యాలు, అందమైన శిల్పాలు, సుందరమైన దేవతా మూర్తులు ఇలా ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది. మాములుగా అయితే ఆలయంలోకి ప్రవేశించగానే దేవతా విగ్రహాని పై నుంచి పాదాల వరకు కనులార చూసుకోని మొక్కుతాం. ఆ ముఖారవిందాన్ని చుసి తన్వయత్వానికి లోనవుతాం. కాని ఇప్పుడు చెఉప్పుకునే ఆలయంలో అమ్మ వారికి శిరస్సు ఉండదు. మరీ ఆ స్తానంలో ఏమి ఉంటుంది అంటే ఓంకారం చేక్కబడిన ఒక పళ్ళేం ఉంటుంది. అదే విశాఖపట్నం జిల్లా దొండపర్తిలో కొలువై ఉన ఎరుకుమాంబ అమ్మ వారు. ఏ అమ్మ వారికైన చీర, పళ్లు, పంచ భక్ష పరమాన్నాలను పెడతారు. కానీ ఎరుకుమాంబ అమ్మ వారికి నీళ్లు మొక్కుకుంటే చాలు అడిగిన వరాలు ఇస్తుందని భక్తుల ప్రగాడ నమ్మకం. ఇక్కడ వెలసిన అమ్మవారి విగ్రహానికి శిరస్సు మెడపై కాకుండ అమ్మవారి కాళ్ళ వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో సత్యం గల తల్లిగా ఎరుకమాంబను భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారు గౌరీ స్వరూపం అని భక్తుల విశ్వాసం. ఏడో శతాబ్దం నుంచి అమ్మ కొలువైయ్యారని స్థలపురాణం చెబుతోంది.

అమ్మవారికి తల ఎందుకు ఉండదు? దీని వెనక ఉన్న కథ ఏమిటి? (Why Does Goddess Erukumamba Have No Head?)

కొద్ది రోజుల ముందు వరకు రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న వైర్ లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. కాని ఇప్పుడు రైల్వేస్టేషన్ నిర్మాణం జరుగుతుండడం వల్ల తత్కాలికంగా గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఖాళి చేసే సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారట. కాని భక్తులు ఎక్కడ ఉంటారో తాను అక్కడే ఉంటానని కొంత మంది భక్తులకు కలలో కనిపించి చెప్పింది అని చెబుతారు. వెంటనే దేవత విగ్రహంను ఎద్దుల బండిలో తీసుకొచ్చే సమయంలో ఆగిన చోట ఆలయంని కట్టి విగ్రహం ప్రతిష్టించాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. అయితే శిరస్సును ఎంత అతికించిన నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని వేడుకోని వెరుపడిన శిరస్సును అమ్మవారి కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే చల్లగా చూస్తానని ఎరుకుమాంబ చెప్పినట్లు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు.

ప్రజల శ్రేయస్సు కోసం ఈ కలియుగంలో అవతరించిన దేవతలలో ఒకరిగా ఎరుకుమాంబను పూజిస్తారు. అమ్మవారికి ఎవరైతే పవిత్రమైన పసుపు నీటితో అభిషేకం చేస్తారో వారి కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రతి బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. వికలాంగులు స్వస్థత పొందుతారు. ఎప్పటి నుంచో వివాహం కాని ఆడపిల్లలకు కల్యాణ యోగం పొందుతారు.

ఎరుకుమాంబ అమ్మవారి పూజ సమయాలు (Pooja Timings of Goddess Erukumamba)

ప్రతి బుధవారం భక్తులు ఉదయం 10 నుంచి 12 గం.ల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గం. వరకు స్నాన ఘట్టాలను ఘనంగా జరుపుతారు. ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి నెలా మూడో గురువారం ఎరుకుమాంబ ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. ప్రజల మధ్య ఉన్న కుల మరియు మత వివక్షను తొలగించడానికి ఈ ఆలయానికి ఎవరు వచ్చినా సరే వారి స్వంత మార్గంలో ఎరుకుమాంబను పూజించవచ్చని ధర్మ కర్తలు నియమం పెట్టారు. విశాఖపట్నం నగరంలో దొండపర్తి ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.

Related Posts

ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

భూమాతకు ఎలా మర్యాద చేయాలి?! How to Respect Earth?

వారణాశిలో 12 రహస్య దేవాలయాలు | 12 Secret Temples of Varanasi

శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple

తిరుమలలో భద్రతపై టీటీడీ కీలక నిర్ణయాలు?! ఇక నుంచి భక్తులు ఖచ్చితంగా పాటించాల్సిందే! | TTD Updates

శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani

https://hariome.com/rohini-nakshatra-guru-pushya-nakshatra/

ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs

ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?

ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God