
What Type of Diet is Best for a Diabetic?
మధుమేహగ్రస్తులు తీసుకొనే పండ్లు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను తరచూ తీసుకోవడం వల్ల అవి మధుమేహగ్రస్తుల్లో చక్కెర స్థాయి నియంత్రలో ఉంటుంది.
అయితే ఈ పండ్లును వారు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.
నేరేడుపండు ఆరోగ్యానికి మంచిది. ఔషధగుణాలు కల్గిన చెట్టు అది. ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్ 15, ఐరన్ 1.2, విటమిన్ సి 18మి.గ్రా. ఉంటాయి.
దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్, ప్రక్టోజ్లు ముఖ్యమైనవి. మధుమేహగ్రస్తులు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు.
తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా తీసుకోవచ్చు.
మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.
గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది : నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది.
శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది: ఆస్తమా, బ్రొకైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది. క్రోనిక్ దగ్గును నివారిస్తుంది.
దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి.
Very use full knowledge
Hariome