
Tithulu and their priorities for Puja
తిథుల్లో దేవతల పూజ – ఫలితాలు
- పాడ్యమి: అగ్నిదేవుణ్ణి పూజించి అమృతరూపమైన నెయ్యితో హోమం చేస్తే అన్నిరకాల ధాన్యాలు అమితమైన సంపద లభిస్తుంది.
- విదియ: బ్రహ్మదేవుణ్ణి పూజించి బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి పంపితే సకల విద్యాపారంగుడవుతాడు.
- తదియ: కుబేరుణ్ణి పూజిస్తే నిశ్చయంగా ధనవంతుడవుతాడు. వ్యాపారాల్లో అధికలాభాలు వస్తాయి.
- చవితి: గణపతిని ఆరాధిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయి.
- పంచమి: నాగదేవతల్ని ఆరాధిస్తే విషబాధలుండవు. మంచి భార్య లభిస్తుంది. మంచి సంతానం కలుగుతుంది.
- షష్ఠి: కార్తికేయుణ్ణి అర్చిస్తే మేధావి, దీర్ఘాయుష్మంతుడు, రూపవంతుడు, కీర్తివంతుడు అవుతాడు.
- సప్తమి: సూర్యభగవానుణ్ణి అర్చిస్తే రోగాలు నశిస్తాయి.
- అష్టమి: శివుణ్ణి ఆరాధిస్తే జ్ఞానం, అపమృత్యు నివారణ కలుగుతాయి.
- నవమి: దుర్గాదేవిని పూజించిన వాడికి దుర్గతులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు యుద్ధాల్లో, వాదాల్లో, వ్యవహారాల్లో విజయం లభిస్తుంది.
- దశమి: యమధర్మరాజుని పూజిస్తే ఆయన అన్ని వ్యాధుల్ని హరించి దీర్ఘాయువుని ఉపాసకుడికి ప్రసాదిస్తాడు. అంతేకాదు నరకం నుంచి ఉద్దరిస్తాడు.
- ఏకాదశి: విశ్వేదేవల్ని పూజించాలి. వారు ప్రీతి చెందితే పశుసంపదని, ధనధాన్యాలని, భూమిని ప్రసాదిస్తారు.
- ద్వాదశి: శ్రీమహావిష్ణువుని భక్తిగా పూజిస్తే సకల కార్యాలూ దిగ్విజయంగా నడుస్తాయి. ఆయన్ని పూజించినవాడు సూర్యుడిలాగా సర్వలోక పూజ్యుడవుతాడు.
- త్రయోదశి: మన్మథుణ్ణి పూజించిన వాడు సుందరమైన రూపాన్ని పొంది అందమైన భార్యతో చిరకాలం సుఖిస్తాడు.
- చతుర్దశి: మహాదేవుణ్ణి భక్తిగా పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
- పౌర్ణమి: చంద్రభగవానుణ్ణి శ్రద్ధగా అర్చిస్తే సుఖంః, శాంతి, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
- అమావాస్య: పితృదేవతల్ని ఆరాధించాలి. వారు సంతృప్తి చెందితే ఆయువుని, రక్షణని, ధనాన్ని ప్రసాదిస్తారు.
ఈ తిధుల్లో గనుక శ్రద్ధగా పూజిస్తే ఆ తిథికి సంబంధించిన దేవతలు ఉపవాసదీక్ష లాంటి కఠిన నియమాలు పాటించకపోయినా సంతృప్తిచెంది కోరిన వరాలిస్తారు.
Related Posts:
తిధులను ఎలా విభజన ఇస్తారు? తిధులు ఎన్ని రకాలు? వాటి ఫలితాలు ఏమిటి!Good Thithulu
Signs of Evil Eye | ఈ సంకేతాలు ఉంటే మీకు నరదృష్టి ఉన్నట్టే! నివారణ ఇప్పుడే తెలుసుకోండి!