
గర్భ వతులయిన స్త్రీల ను చిన్నపిల్లల కంటె ఎక్కువ అపురూపం గా చుచుకొనే సంప్రదాయం మన భారత దేశం లో ప్రాచీన కాలం లొ వుండేది. అందుకే కూతురు గర్భం దరించ గనే పుట్టింటి వారు తమ ఇంటికి తీసుకువెళ్ళి కూతురు ని తమ వద్దే ఉంచుకొని ఎంతో అల్లారు ముద్దు గా ఆమె అడిగిన అన్నీ కోర్కెలు తీర్చి సంతోష పెడుతూ వుండేవారు పుట్టింటి వారు. పుల్లని పదార్థాలు కానీ, తీపి పదార్థాలు కానీ గర్భిణీ స్త్రీ ఏది కోరితే అది క్షణాలలో తీర్చేవారు ఆలా గర్భిణీ స్త్రీ కోరిక తీర్చ కపోతే ఆమె కు పుట్ట్ బిడ్డ సన్న గా అనారోగ్యం గా ఉండే బిడ్డ పుడుతుందని పెద్దలు చెప్పే వారు
అయితే ఇలాంటి ఆచారవిధానాన్ని పెద్దలు ఏర్పాటు చేయడం లో ఎంతో శాస్త్రీయత దాగి ఉందని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్ధం అవుతుంది
పెద్దలు చెప్పిన మాటల్లో వున్నా శాస్త్రీయత
గర్భిణీ స్త్రీ కి నాలుగవ మాసం వచ్చేటప్పటికి ఆమె కడుపులోని బిడ్డ కు అన్నీ అవయవాలు ఏర్పడడం జరుగుతుంది, హృదయం ,తయారై భావమును వ్యక్తీకరించు శక్తి గర్భస్థ పిండానికి ఏర్పడడం వల్ల ఆ బిడ్డ ను ధరించిన తల్లికి అనేక కోరికలు ఏర్పడుతాయి. అంటే గర్భిణీ స్త్రీ నాలుగవ మాసం నుండి రెండు హృదయాలు కలిగి వుండి ” దౌహృదీని’ అని పిలువ బడుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలకు కోరిక తీరక పోతే ఆమె బాధ బిడ్డ కూడా చేరి ఆ బిడ్డ అనారోగ్యం తో పుట్టే ఆవకాశం కలుగుతుంది.